25, నవంబర్ 2013, సోమవారం

తల తెగిపడినా ఈ నేల నాదే...



మధ్య తరగతి బుద్ధిజీవులకు ఈ దేశ ప్రజాస్వామ్యంపై ఈ పింజారీ వ్యవస్థపై నమ్మకాన్ని సడలకుండా పోరాడే తత్వాన్ని దూరం చేసేందుకు విదేశీ స్వదేశీ పెట్టుబడిదారుల తొత్తులు అయిన NGO's, కొన్ని మీడియా సంస్థలు (తెహెల్కా వంటివి) చాలా కృషి చేస్తున్నాయి అని అర్థమవుతోంది కదా! వీళ్ళ వెనక దోపిడీదారుల సొమ్ము పెట్టుబడిగా థింక్ వెస్టివల్స్, మరికొన్ని సాహిత్య సేవలు (రాంకీ వంటివి) పేరిట ఆలోచనలను కుళ్ళబెట్టే పండగలు జరిపి దేశానికి ఉద్దరించేస్తున్నామని డబ్బాలు కొడుతుంటాయి. వీళ్ళ అసలు రంగు ఇలా బయటపడుతుంది అప్పుడప్పుడు. ఈ గ్రీకు వీరుల రంకు చేష్టలు, మహిళలపై దాడులు హీరోలుగా ప్రచారానికీ ఉపయోగపడుతుంటాయి.
మధ్య భారతంలో జరుగుతున్న అక్రమ మైనింగ్ వ్యాపారానికి తీవ్ర స్థాయిలో ఎదురవుతున్న స్థానిక గిరిజన ప్రజానీకంపై జరుగుతున్న అమానుష అత్యాచార దాడులను ఒక్క మీడియా కూడా ప్రచారంలోకి తేవడంలేదు. అటు సైన్యం చేతిలో, ప్రైవేటు సైన్యం చేతులలో హత్యలకు, మానభంగాలకు గురవుతున్న నియాంగిరీ ప్రాంత ఆదివాసీ ప్రజానీకం తమపై జరుగుతున్న దాడులకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రతిఘటన ర్యాలీలు చిన్న స్థానిక నియోజక వర్గం కాలంలలో ప్రచురించే మీడియా సో కాల్డ్ ఫేజ్ త్రీ షోకిల్లా రాయులకు ఇంత పబ్లిసిటీ ఇస్తుంది. 

ఆదివాసీలను మనుషులుగా గుర్తించని వీరు మనుషులేనా??
ఈ దేశ ఖనిజ సంపదను, నేలపై హక్కును కాపాడి తద్వారా ఈ దేశ సార్వభౌమత్వాన్ని సమున్నతంగా నిలిపే ఆ మూలవాసులు చేసే పోరాటానికి కాసింత బాసటగా నిలుద్దాం. తద్వారా మన కాళ్ళ కింది నేలను కాపాడుకుందాం.