27, అక్టోబర్ 2016, గురువారం

బెజ్జంగీ = యురీ దాడి


ఒక అసహజ మరణం పొందిన దేహానికి పోస్ట్ మార్టం చేయించడానికి ఎన్ని తిప్పలు పడితే బతిమాలుకుంటే రోజంతా రోదిస్తూ కాళ్ళా వేళ్ళా పడితే గవర్నమెంట్ ఆసుపత్రిలో డాక్టరుకు  గంటా రెండు గంటలు పడుతుంది. అలాగే సాయంత్రం 5 తరువాత రూల్స్‌ ఒప్పుకోవని రేపటికి వాయిదా వేస్తారు. అలాంటిది కనీసం శవపంచనామాలు కానీ వీళ్ళు చెప్పే ఏ చట్టపరమైన రూల్స పాటించకుండా అర్థరాత్రి పాతికపైగా శవాలకు గిన్నీస్ రికార్డ్ టైంలో  పోస్ట్ మార్టం చేసేసి ఒక కంటైనర్లో అట్టపెట్టెలలో పడేసి కుళ్ళబెట్టన డీజీపీ ఎంత సౌమ్యంగా మీడియా ముందు ఎన్నెన్ని చిలుకపలుకులు వల్లిస్తున్నాడో. నిన్నొక నాలుగు శవాలు పోగేసి హెలికాప్టర్ లో చక్కెర్లు కొడుతుంటే కాల్పులు జరిపారు ఎదురు కాల్పులలో చనిపోయారు గుర్తు తెలియని వారంటారు. ఈ అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో రాజ్యాంగబద్ద యూనిఫాం ఉద్యోగి ఎన్ని అబద్ధాలు ఆడాలో అన్నీ ఆడుతన్నాడు. 

నువ్ నిజంగా ఎదురుకాల్పులలో చంపితే హైకోర్టు ఇచ్విన ఉత్తర్వులు పాటించి కెజీహెచ్ కు తీసుకు రావడానికి ఎందుకు భయపడ్డావు దొరా? పోస్ట్ మార్టం వీడియో తీయాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలు ఎందుకు పాటించలేకపోయావొ చెప్పగలవా? వాళ్ల మొఖాలపై కత్తి గాట్లు నోటిలోంచి వచ్చిన పచ్చి నెత్తురు ఏ సాక్ష్యం చెప్తున్నాయి? ఇరవై ఏళ్లు నిండని ఆ లేలేత ముఖాలు కళ్ళు పీకిన నీ చేతులను ధైర్యంగా చూపగలవా?  కనీసం అక్కడ కాల్పులు జరిగిన ప్రదేశం ఫోటోలు ఎందుకు చూపలేక గుట్టలు వాగులు ఫోటోలు చూపుతున్నావు దొరా? రాజకీయ నాయకుల అరికాళ్ళు నాకే ఈ అధికారులు ఎన్నెన్ని అసత్యాలు ప్రచారం చేయాలో చేస్తున్నారు.

ఇంతమంది ఆదివాసీలను చంపి కనీసం శవాలపట్ల కూడా మానవత్వం చూపని వారు ఢిల్లీలో గిరిజన కార్నివాల్ జరిపి ఆదివాసీల హక్కులను భూములను హరిస్తే సహించననీ నీతులు వల్లిస్తాడు మన ప్రధాని రూపంలొని అసలు పోలీస్ బాస్. కనీసం అక్కడ చనిపోయిన వాళ్ళలో మూడు వంతులమంది ఆదివాసీ మహిళలు యువకులే కదా? వారి మాట కూడా ఎత్తకుండా చేతులూపి మాటాడే ఇండియన్ ట్రంప్ ఎవరిని బుజ్జగించగలడు.

ఇలా విషప్రయోగము జరిపి మత్తులో వున్నవారిని చంపి వారి పట్ల మాకు వ్యతిరేకత లేదు వారి చర్యలపైనే అని సన్నాయి నొక్కులు నొక్కి రక్తపుటేరులు పారించే వీళ్ళు యురీలో దాడి చేసిన పాకిస్తాన్ ఉగ్రవాదులకు ప్రతిరూపాలు కాదా? దీనిని సర్జికల్ స్ట్రైక్స్ తో పోల్చి గొప్పలు చెప్పడం కాదు. ఇది రాజ్యం ఉగ్రవాద దాడి. కనుకనే ఇంత మంది తెలుగు వారు చనిపోతే ఇరు రాష్ట్రాల అమావాస్య చంద్రులు నోరు మెదపరు. ప్రతిపక్ష నాయకులు ఖండించరు. వీళ్ళంతా ఒకే అతుకుల బొంతలోని చినుగులు కనుక. 

ప్రజాస్వామ్య వాదులారా విదార్థీ యువజన మేధావుల్లారా ఆలోచించండి. ప్రశ్నించండి.

Condemn the State Terrorism on its own people.