
ఈ రోజు అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం ప్రజాస్వామ్యం ఖూనీ ఐపోవడమా?
అసలు ఈ గవర్నర్ ఎన్నడైనా ప్రజాస్వామ్యయుతంగా వ్యవహరించారా? ఆయన వచ్చినప్పటినుండి ఇక్కడ వివాదాలను సృష్టిస్తూ వస్తున్నారు. ప్రజా సమస్యలపట్ల చాలా చులకన భావంతో వ్యాఖ్యానిస్తుంటారు. అసలు ఓ మాజీ ఐ.పి.ఎస్.అధికారిని ఇక్కడ గవర్నర్ గానియమించడంలో ఉద్దేశ్యం పాలనా పగ్గాలను పోలీసు వారికి అందజేయడానికే కదా? తెలంగాణా అంశం పట్ల వైరి భావంతో వున్న ఆయన తన ప్రసంగ పాఠం అంతా రాష్ట్రం సుభిక్షంగా వర్థిల్లుతోందన్న రాత కాపీని చదివి ఎవర్ని మోసపుచ్చడానికి. ఇన్నాళ్ళకు తెలుగు వాళ్ళకు పౌరుషముందనిపించారు. మాజీ తమిళపోళ్ళందరికీ పదవులు కట్టబెడుతున్న చిదంబరం అండ్ కో కు ఇది చెంపదెబ్బ.
ఇంక ఏకైక సత్తా MLA గారు జె.పి. మైకు దొరగ్గానే తన బాణీలో రెందు నాల్కల ధోరణిలో కఱ విరక్క పాము చావక లాంటి మాటలు మాటాడుతుంటే తగిన బుద్ధి చెప్పారు. ఈయనొక్కడే నీతిమంతుడు ప్రజాస్వామ్య పరిరక్షకుడులా ఫోజు కొడ్తుంటాడు. ఈయన IAS అయిన తరువాత ఆ ముందు ఆస్తులు గురించి మాటాడితే బాగుణ్ణు.
అసెంబ్లీ, పార్లమెంటు సభ్యులను ప్రశ్నించడం నేరమా? ఆ రెండూ నిజంగా ప్రజాస్వామ్య యుతంగా పనిచేస్తున్నాయా? అసలు వీళ్ళంతా రాజ్యాంగ బద్ధంగా వ్యవహరిస్తున్నారా? ఓట్లేసిన పాపానికి జనం నెత్తినెక్కి వీళ్ళ వీళ్ళ కులాలు, వర్గాల వ్యాపారాలను అభివృద్ధి చేసుకోవడానికి, ఆస్తులను కాపాడుకోవడానికి తప్ప వేరే ధ్యాస వుందా? ఎవడికి నచ్చినట్లు వాడు జీవోలను రాసుకుంటూ స్వప్రయోజనాలను కాపాడుకోవడాఅనికి పాటుపడడమే. కోట్లాది రూపాయల కుంభకోణాలు చేస్తూ ప్రజల ఆస్తులను తెగనమ్మేస్తూ హిరణ్యాక్ష పాలనచేస్తున్న వీళ్ళు ప్రజాస్వామ్యం గురించి కామెంటు చేయడం? ఎవడి స్వలాభపేక్ష కోసం వాడు ప్రజలకు ఏదో చేసేస్తామని హామీలు ఇచ్చి గద్దెనిక్కి వారి మందీ మార్బలాన్ని పెంచుకోవడానికి కాకపోతే నీతి కబుర్లెందుకు?
ఆరు వందలమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం ప్రజ్సాస్వామ్యం ఖూనీ కావడం కాదా? వాళ్ళ ఆశను నెరవేరుస్తున్నామని చెప్పి మోసం చేయడం ప్రజాస్వామ్యం ఖూనీ కావడం కాదా?