నిజాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
నిజాలు లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

15, డిసెంబర్ 2010, బుధవారం

నిజంగా రాడియాకు ఇదంతా సాధ్యమా?




కెన్యాలో పుట్టి , లండన్ లో విద్యాభ్యాసం చేసి తన చాతుర్యంతో ఒక దేశ పాలనా వ్యవస్థనే శాసించే స్థాయికి ఎదిగిన నీరా రాడియాను అభినందించకుండా ఉండగలమా?

అసలు ఒక కార్పొరేట్ లాబీయిస్టుగుప్పెట్లోకి మొత్తం దేశ పరిపాలనతోపాటు, ఆర్థిక వ్యవహారాలనే తాకట్టుపెట్టబడ్డాయంటే మనమెంత భద్రంగా వున్నామో తేటతెల్లమైంది..

నిజంగా ఈరోజు దేశ ఇంటలిజెన్స్ వ్యవస్థ ప్రధాని తమిళనాడు పర్యటనకు వెళితే టైగర్స్ వలన ముప్పుందని చెప్పారంట. ముప్పు పూర్తిగా అణగదొక్కబడిన వాళ్ళ వలన లేక కరుణ వలనన్నారో.. ఇలా మన మీడియా ద్వారా చీదించారా?

ప్రైవేటు ఆర్థిక దిగ్గజాలైన అంబానీ, టాటాలు తమ వ్యాపారాల కోసం ఎంత దిగజారి పావులు కదుపుతారో ప్రజలకు అర్థమైంది. మరల ఇందులో తమ పరువు పోతుందని కోర్టులకెక్కడమొకటి.

దేశ సర్వోన్నత న్యాయస్థానంలో కూడా ఈ తీగల ముళ్ళు చుట్టుముట్టాయన్నది మాజీ ప్రధాన న్యాయమూర్తిగారిపై వచ్చిన ఆరోపణలతో అసలు కార్పొరేట్ రంగం ఈ దేశ చతురంగ వ్యవస్థను ఎంతలా దిగజార్చిందో మనకర్థమౌతోంది.

ఈ దేశానికి అంతర్గత భద్రతకు మావోయిస్టుల వలన ముప్పని ఎక్కడ మైకు దొరికితే అక్కడ ఊదర గొట్టే ప్రధానికి ఈ లక్షా డెబ్బై వేలకోట్ల కుంభకోణం ఈ దేశ జవసత్వాలను పీల్చి పిప్పిచేస్తుంటే నోట్లో ఏమడ్డమొచ్చి ఊరకున్నారో?

ఓ పెద్ద రెండు రాష్ట్రాల సం.బడ్జెట్ అంత మొత్తం ఒకరి గుప్పెట్లోకి పోతే అంతర్జాతీయ స్థాయి ఆర్థిక మేధావుల పాలన ఇలా ఏడ్వడానికి వున్న చిదంబర రహస్యమేమిటో?

పార్లమెంటు మొత్తం స్థంభించిపోయి సమస్యలన్నీ గాలికొదిలేయబడి దేశ ప్రజాస్వామ్య వ్యవస్థ సిగ్గుతో తలదించుకొనేట్లుంటే ఇక్కడ మౌనం దాల్చి ఎక్కడో యూరోపియన్ దేశంలో నా పార్లమెంటో అని ఏడ్చిన వాణ్ణి ఇతగాన్నే చూసాం..

అటు ప్రతిపక్షం అధికారంలో వున్నప్పటి నుంచి ఇప్పటి అధికార పక్షం వరకు రాడియా నీడ చాటుకు పోవడాన్ని ఇంత మౌనంగా ఈ దేశ ప్రజలు భరిస్తున్నారంటే ఎంత దౌర్భాగ్య స్థితిలో వున్నామో కదా?

ఒట్టిపోయిన ఆవుకు మేపు దండగన్నట్లు, చెవిటోడి ముందు శంఖమూదినట్లు ఎన్నని ఏం లాభం..

నిద్రపోయే వారిని లేపగలం కానీ, నిద్ర నటించే వాళ్ళని లేపడం ఎవరి తరం?

మేధావి వర్గం కార్పొరేట్ మాయలో పడింది.
యువత కెరీరిజం మోజులో కూరుకుపోయింది.
సామాన్యజనం ఏ పూట బత్తెం ఆ పూట దేవులాటలో కొట్టుమిట్టాడుతోంది.
కోట్లు దొబ్బుకుపోయేవాడు చల్లగా జారుకుపోతున్నాడు.

ఏ రోజుకారోజు ధరలు ఆకాశం దాటి దూసుకుపోయినా మన సెల్ మోగితే చాలు.. ఓ వంద ఫ్రీ మెసేజ్ లతో ఆడుకుందాం రా!!

29, మే 2010, శనివారం

వారిపై నెట్టాలని చూస్తారా?



నిన్న ప.బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదానికి మావోయిస్టులే కారణమని అంతా వారిపైకి నెట్టాలని చూసారు. కానీ అది తా్ము చేసింది కాదని వాళ్ళు ప్రకటించారు. యిదంతా అక్కడ రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార యంత్రాంగ వైఫల్యాన్ని వారిపై నెట్టివేస్తె ఒ పనైపోతుంది. మరింత కౄరంగా ఆదివాసీ్లపైనా, వారి్పైనా దాడులు చేసి రాబోయే ఎన్నకల నాటికి అడ్డు లేకుండా చేసుకోవచ్చని సిగ్గు విడిచి ప్రకటించాయి. కానీ మావోలు దీనిని తిప్పి కొట్టారు. ఆ తరువాత రైల్వే మంత్రి గారు ఇది వాళ్ళు చేసి వుంటారనుకున్నాం, కానీ దీనిపై సి.బి.ఐ.దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. ఐఇడిలు వాళ్ళ ఒక్కరి వద్దే వున్నాయా? యిటువంటి విద్రోహ చర్యలు జరుగకుండా తగిన జార్గత్తలు తీసుకోలేరా? రైల్వే ట్రాక్ సిబ్బంది ఏమయ్యారు? ఇది అధికార యంత్రాంగ వైఫల్యాన్ని కప్పి పుచ్చే యత్నం.

ఒకరిపై ఆరోపణ చేసే ముందు అన్ని కోణాలలో పరిశీలించాల్సిన అవసరం వుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్లు అధికారం వుంది కదా అని ప్రవర్తించ కూడదు.

8, జనవరి 2010, శుక్రవారం

మీడియా - నడమ౦త్రపు సిరికి విషపుత్రిక

ఆనాడు మహాకవి అన్నట్టుగా పత్రికలు పెట్టుబడికి విషపుత్రికలులా మీడియా కూడా పెట్టుబడికి, నడమంత్రపు సిరి అయిన రియలెస్టేట్ వ్యాపారులకు పుట్టిన విషపుత్రికలుగా ప్రజల సున్నిత భావాలపై దాడి చేస్తూ రాష్ట్రాన్ని, దేశాన్ని అల్లకల్లోలం చేస్తున్నాయి. తమ రేటింగ్ పెంచుకోవడానికి ఎన్నెన్ని వెధవ వేషాలు వేయాలో వేస్తున్నాయి.
ఈ రోజు రాష్ట్రం రావణకాష్టంలా రగిలిపోవడానికి ఈ మీడియా కథనాలే కారణం. ఎప్పుడో 4 నెలల క్రితం ప్రచురించబడ్డ వార్తను చూపించి గంటలకొద్ది దానిపై విశ్లేషణలు ప్రచారం చేస్తూ ప్రజల మనోభావాలను రెచ్చగొట్టి, గూండాల దాడులను ప్రోత్సహించిన వైనం అత్యంత విషాదకరం. దాడులు జరుగుతున్నాయన్న విషయాన్ని ఎంతో exciting గా ఆ యాంకర్ చెప్పడం చూస్తుంటే వీళ్ళూ వార్తా ప్రసారకులా లేక విషప్పురుగులా అనిపించింది.

బూతు సీన్లతో బుల్లి తెరను నింపి నట్టింట్లో నగ్న నృత్యాలు చేస్తున్నాయి. పసిపాపల స్వేచ్చను హరించె డాన్సు పోటీలు, వారి గొంతులపి ముళ్ళమాటల తో దాడి చేస్తూ, పిచ్చి తల్లిదండ్రుల వెఱి ఆవేశాలను సొమ్ముచేసుకుంటున్నాయి. ఇంతవరకు సమాజానికి ఉపయోగపడే ప్రోగ్రాం ఒక్కటి లేదు. జరిగిన దానిని గోరంతలు కొండంతలు చేస్తూ, మూర్ఖపు వ్యాఖ్యానాలతో, అతి తెలివి తీర్మాణాలతో ప్రజలను తప్పుదోవపట్టిస్తూ ఉద్రేకాలను రెచ్చగొడుతు వయాగ్రా మాత్రలలా తయారయ్యాయి. ఈ చానళ్ళ వెనక ఒక్కో దానికీ ఒక్కో రాజకీయ పార్టీల అండదండలున్నాయనడం నగ్న సత్యమే. ప్రజల ధన మాన ప్రాణాలను హరిస్తున్న ఈ ప్రసారాలను నియంత్రించకపోవడం మన రాజకీయ రాబందుల అవకాశవాదాన్ని బయటపెడుతోంది.మరల వీళ్ళలో వీళ్ళే ఆ చానల్ యిలా ఈ చానల్ ఇలా చేసిందని ఒకరిపై ఒకరు దుమ్మెత్తిపోసుకోవడం. ఈ పోటీ వాతావరణం సమాజాన్ని చెడగొడుతోంది. కావున విజ్నులైన ప్రజలే వీటిని సామాన్య జనానికి అర్థమయ్యేట్లు చెప్పాలి. ప్రతి ప్రింట్ మీడియా వాడు ఒక్కో చానెల్ పెడుతూ ఇబ్బడి ముబ్బడిగా లాభాలార్జిస్తూ ప్రజల మనోభావాలను దేబ్బతీస్తున్నారు. ఇంకా మేలుకోకపోతే సమాజంలో అరాచకం ప్రబలిపోతుంది. తస్మాత్ జాగ్రత జాగ్రత.