
హాయిగా బొజ్జనిండా తిని, తోచినదేదో ఉపదేశాలిస్తూ, వచ్చిన కట్న కానుకలతో జల్సాచేస్తూ, కాలక్షేపం చేయక చైన్నై రాజకీయాలతో చేతులు కాల్చుకొని, కటకటాలు లెక్కపెట్టి, చావుతప్పి కన్నులొట్టపోయిన చందాన బయటపడిన మీరు ఇక్కడి ఉద్యమాలపై ప్రజల ఆవేశాలను రెచ్చగొట్టేలా మాట్లాడడం ఎవరిని మెప్పించడానికి? వేసుకున్న కాషాయ వస్త్రాలపై వున్న గౌరవం మీలాంటి వారి వల్లనే మట్టిగలిసిపోయాయి. రాజకీయాలు మీకెందుకు? మీరేమైనా దివ్యదృష్టితో తెలంగాణా ప్రజల మనోభావాలను హాంఫట్ అని పట్టేసారా? తెలంగాణా భూమిలో పర్యటించి, వారితో మాటాడి అక్కడే ప్రకటించి వుంటే మేమంతా నమ్మేవారం. హాయిగా యికనైనా ఏసీ రూంలలో జపతపాలు గావించి తమ ముక్తిమార్గమేదో మీరు చూసుకుంటే మీకు ప్రశాంత స్వర్గ ప్రాప్తినొంది అక్కడకూడా సుఖాలను అనుభవించే చాన్సుకోసం ట్రై చేయండి స్వామి. పుణ్యం పురుషార్థం దక్కుతాయి. మీకెందుకీ గొడవలు?