
1949 అక్టోబర్ 1 వ తేదీనాడు చైనా గణతంత్ర స్థాపన సగర్వంగా సత్య నిష్ఠతో ప్రకటిస్తూ మావో-సే-టుంగ్ ఒక సందేశాన్నిచ్చాడు. సామ్రాజ్యవాద ఉచ్చునుండి నాల్గవ వంతు మానవాళి విముక్తికి సంబంధించిన, శతాబ్ధాల తరబడిగా సాగిన మధ్యయుగాల ఫ్యూడల్ అణచివేతనుండి 60 కోట్లమంది ప్రజలు సాధించిన స్వేచ్చకి సంబంధించిన సందేశమిది. తమ సామ్రాజ్యవాద యజమానుల అండదండలతో కేవలం ఒక పిడికెడుమంది పాలకులు సాగిస్తుండిన నిరంకుశ పాలననుంచి, అమలుచేస్తుండిన అణచివేతనుంచి, సృష్టిస్తుండిన పేదరికంనుంచి యావత్ చైనా ప్రజలు సాధించిన విముక్తికి సంబంధించిన సందేశమిది. ఈ చారిత్రక సందర్భంగా మావో ఏమని ప్రకటించారంటే " చైనా ప్రజలు లేచి నిలుచున్నారు " అని! ఈ ఘనవిజయంతో ప్రపంచం మొత్తంలో మూడవ భాగం సోషలిస్టు శిబిరంలో అంతర్భాగమైంది!
చైనా విప్లవ 60 వ వార్షికోత్సవ సందర్భంగా ఆ మహా విప్లవ ఘనవిజయాలలో కొన్నింటిని జ్నప్తికి తెచ్చుకుందాం! న్యాయదృష్టి, సమత్వ దృష్టితో ఉత్తేజితులైననాడు మనిషి ముందు అవతరించగల మహదవకాశాలను చేపెట్టిన విజయాలవి. మార్క్సిజం-లెనినిజం జనబాహుళ్యం లోకి చొచ్చుకుపోయిననాడు అది చోదక శక్తి కాగలుగుతుందనే దానికి సజీవ నిదర్శనం చైనా విప్లవం! ఈ మహత్తర ప్రయోగంలో స్వర్గాలు ఒక్కసారిగా తలక్రిందులైనాయి! ' అనంతులు ', ' అవినాశులు' అనిపించుకునే దేవతలంతా కట్టకట్టుకు భూమిపై వాలారు! పాతుకుపోయిన విలువలు, సాంప్రదాయాలనేవన్నీ పెకళించబడి
బూడిదయ్యాయి! తలక్రిందులుగావ్రేళ్ళాడుతుండిన ఆర్థిక,రాజకీయాల్ని వాటి కాళ్ళపై సవ్యంగా నిలబెట్టడం జరిగింది. ఇలాంటి ఈమహాకల్లోలం ద్వారా, ఈ తీవ్ర అవ్యవస్థ ద్వారా ఒక సముజ్వల నూతన వ్యవస్థకి అంకురార్పన జరిగింది. అదే సోషలిస్టు వ్యవస్థ. ఒక నూతన మానవ సృష్టికి పిండోత్పత్తి ప్రారంభమైంది. ఆమనిషే కమ్యూనిస్టు!
ఈ గొప్ప విప్లవం తిరగదోడబడే అవకాశాలకి సంబంధించి మావో నిరంతరాయంగా చేస్తూవచ్చిన హెచ్చరికలకిది నిదర్శనంగానే ఈరివిజనిస్టు విద్రోహంవుంటుంది. శతాబ్ధాల తరబడిగ ామనుషుల్లో పాతుకుపోయిన బూర్జువా వ్యవస్థ, బూర్జువా విలువలు,బూర్జువా ప్రాపంచిక దృక్పధం అనేవి ప్రజల మస్తిష్కాలలో చెరిగిపోనివిగా వుంటూ ప్రభావితం చేస్తూనే వుంటాయి గనుక, వాటితో నిరంతరాయంగా, నిర్విరామంగా పోరాడుతూనే వుండాలనే లెనినిస్టు అవగాహనకి నిదర్శనంగాను దాన్నిస్అమ్ర్ థించేదిగానే వుంటుంది - ఈరివిజనిస్టు పునరుథ్థానం. ఈ విద్రోహానికి ఖచ్చితంగా దానికుండే కారణాలు౦టాయి.విధానాలలో వుండే కొన్ని బలహీనతల్లోనే ఈకారణాలని చూస్తే సరిపోదు! అంతకంటే మరింత ముఖ్యంగా – ఇలాంటి ఈ ప్రయోగం మొట్ట మొదటిది అయిన కారణంగా దాని అపరిపక్వతలోనేఅది తిరగదోడబడగల కారణాలు, బలహీనతలు సైతం అంతర్భూతంగా వుంటాయి. కనుక దీన్నుంచి పాఠాలనేవి ఖచ్చితంగా తీసుకోవాలి! అప్పుడు మాత్రమే, రాగల శతాబ్ధిలో కమ్యూనిస్టులు,గత విప్లవానుభవాల నుంచి, ప్రత్యేకించి చైనావిప్లవానుభవాలనుంచి సంపద్వంతమవుతూ, బలపడుతూ పురోగమించడానికి సాధ్యమవుతుంది.
చైnనావిప్లవానంకి సంబంధించినచ్హ్ ఎప్పుకోదగ్గ విజయాలనiి,అలానే అది తిరగదోడబడడానికి దారితీసిన కారణాల్ని కూడా మరోసారి గణన చేసుకోవడమనేది అనేక విధాల ప్రయోజనకరం! ముందుగా చెప్పుకోదగ్గది – సోషలిస్టు పునాదులన్నీ కూలిపోవడంతో సోషలిజంభవితవ్యానికి సంబంధించిన నైరాశ్యం అనేది చోటు చేసుకూంది. ఈ నైరాశ్యానికి తక్షణ పరాజయాలవ్ ఆస్తవికతలో కొంత పునాది వుంది. ఇకరెండోది ఏమంటే ఉన్నత సాంకేతిక ప్రచారోధృతితోను దానికి తోడువ్ ఇనిమయ సంస్కృతి వ్యామోహంలో చిక్కుకుపోయి సిధ్ధాంతాన్ని, సదాశయాల్నiి,నూతన వ్యవస్థ స్థాపనకి సంబంధించిన సదవకాశాల్ని తిరస్కరించే ధోరణిఅం ఏది ప్రబలి పోవడం; వెనుకడుగువ్ ఏసిన కమ్యూనిస్టు ఉద్యమంలో బలమైన రివిజనిస్టు ధోరణులు ప్రబలి పోవడం అవి చైనా విప్లవ అంతర్జాతీయ ప్రాముఖ్యతని,అది ప్రోది చేసిన సంపదని, మావో ఆలోచనా విధానాన్ని లేక మావోయిజాన్నివ్యతిరేకించడం అనేది మూడవ కారణం; నాల్గవ కారణ ఏమంటే-మావోయిస్టులలో సైతం తలెత్తిన పెడధోరణి- అదేమంటే ఈమహత్తర చైనా విప్లవానుభవానికి కేవలం నోటిమె చ్చుకోలుదనాన్ని ప్రదర్శించడం లేdదాదాన్ని ఒంటెత్తువాద నినాదప్రాయానికి కుదించేస్తూ తద్వారా భవిష్యత్ కమ్యూనిస్టు ఉద్యమాలకి అది మార్గదర్శక అనుభవంగaావుండగల దాని ప్రాధాన్యతని నిరాకరించడం. ఇక ఐదవది చివరిది అయిన కారణం ఏమంటే-చైనా విప్లవ నిర్ధిష్ట విజయాలకి సంబంధించిన, సోషలిస్టు నిర్మాణ నిర్ధిష్ట విజయాలకి సంబంధించిన వాస్తవికతని మరుగుపర్చడానికి పనిగట్టుకు ప్రయత్నించే బూర్జువాలు, రివిజనిస్టులు మరeీప్రత్యేకించి సూకల్డు సామాజికఅ అచరణ వాదులుgగాఊరేగే ప్రభుత్వ యేతర సంస్థలు ( N.G.O.) లు పాటించే ఈ కుట్రపూరిత నిశ్శబ్ధాన్ని చేది౦చాల్సి ఉండటంగా అది జరగక పోవడం. తక్షణ అవసరంరీత్యా కూడా ఇందుకు పూనుకోవాలి.
(శ్రామికవర్గ ప్రచురణలు ‘ చైనావిప్లవ స్మృతిలో’ నుండి గ్రహించినవి.)


