6, డిసెంబర్ 2012, గురువారం

మాయా ములాయంల దళారీ దగాకోరుతనం..

విదేశీ చిల్లర పెట్టుబడులను మన దేశీయ మార్కెట్లోకి అనుమతించే బిల్లును పార్లమెంటులో ఆమోదం పొందడానికి పరోక్షంగా సహకరించిన మాయావతి, ములాయం సింగ్ లు తమ దేశ ద్రోహత్వాన్ని కళ్ళబొల్లి కబుర్లతో కప్పిపుచ్చుకోలేరు.. 

ప్రతిసారీ కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వం సంకట స్థితిలో పడ్డప్పుడూ ఇలాంటి అటూ ఇటూ కాని పార్టీలతో నెగ్గుకొస్తున్నది కాంగ్రెస్ మైనారిటీ ప్రభుత్వం.  ఒక వైపు ప్రజల పట్ల ఎంతో బాధ్యత వున్నట్టు ప్రవర్తిస్తూ వీళ్ళు లోపాయకారీ ఒప్పందాలతో సామ్రాజ్యవాద దేశాల హుకుంను ఇక్కడ అమలు చేయడానికి తోడ్పడుతున్నారు. ఇటువంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా వుండాలి. సి.బి.ఐ. బూచిని చూపుతూ రాజకీయ నాయకుల అవినీతిని తమ వ్యాపార లావా దేవీలకు అనుగుణంగా వాడుకుంటున్నారు.  అయినా ఈ పాలక పక్షాలన్నీ ఒక తానులోని గుడ్డలే కదా!!

వీళ్ళకు ప్రజల బాగోగుల పట్టవు. దేశ ఆర్థిక స్వావలంబన పట్ల నిజాయతీగా కృషి చేసే విధానాలమీ లేవు. దేశాన్ని తాకట్టు పెట్టి తమ స్వంత ఆస్తులను కూడబెట్టుకునే వ్యాపార దళారీ తత్వమే. కావున ఈ దళారీ పాలక వర్గాలను తప్పక నిలదీయాల్సిన అవసరముంది.