28, సెప్టెంబర్ 2009, సోమవారం

భారత విప్లవాకాశంలో వేగుచుక్క కా.భగత్ సింగ్ జన్మదినం


రోజు భారత స్వాతంత్ర్య పోరాటంలో చిరునవ్వుతో ఉరికొయ్యను ఊగి దేశ యువతరానికి విప్లవకర సందేశాన్నిచ్చిన కా.భగత్ సింగ్ ౧౦ జన్మదినం. పంజాబ్ లోని లాయల్ పూర్ జిల్లా (ఇప్పుడు పాకిస్తాన్లో వుంది), .9 గం.లకు జర్రానవాలా తాలూకా బంగా గ్రామంలో కిషం సింగ్విద్యావరి దంపతులకు 1907 సం.లో జన్మించాడు.

భగత్ సింగ్ కుటుంబమంతా స్వాత్రంత్ర్య పోరాటంలో పాల్గొన్న వారే. భగత్ సింగ్ జన్మించిన మూడేళ్ళకే లాహోర్ సెంట్రల్ జైలులో తీవ్ర నిర్భంధం అనుభవించి క్షయ వ్యాధికి గురై 32 ఏళ్ళ చిన్న వయసులోనే తన చిన్నాన్న స్వర్ణ సింగు మృతి చెందారు. వీరి ఆశయాలను వంటబట్టించుకొని చిన్న నాటినుంచే భారత దేశ స్వేచ్చా స్వాతంత్ర్యాలను కలలు కంటూ పెరిగిన వాడు.

విధ్యార్ధి దశలోనే 1921 సెప్టెంబరులో గాంధీ పిలుపునందుకొని కాలేజీనుంచి బయటకు వచ్చేసాడు. తన రాజకీయ జీవితంలో కొంతకాలం అతివాద దుందుడుకు చర్యలకు పాల్పడినా మార్క్సిస్టు రచనల అధ్యయనంతో భారత దేశంలో కూడా రష్యా దేశం వలే కమ్యూనిస్టు పార్టీ నాయకత్వంలో కార్మిక వర్గ విప్లవాన్ని కాంక్షించాడు.

తొలుత బ్రిటిష్ పోలీసు వాడి దెబ్బలకు లాలాలజపతి రాయ్ మరణించడంతో ప్రతీకారంగా సాండర్సును మట్టుపెడతాడు. తరువాత నాటి చెవిటి ప్రభుత్వానికి దేశ ప్రజలనుభవిస్తున్న నిర్భంధాన్ని, దారిద్ర్యాన్ని గట్టిగా వినిపించే ప్రయత్నంలో నాటి పార్లమెంటులో పొగబాంబులు వేసి స్వచ్చందంగా అర్రెస్టు కావడం ఆయన జీవితంలోముఖ్య ఘట్టాలు. 1926 లో లాహోర్ లో నౌజవాన్ సభ స్తాపించి యువకులను విప్లవ పథం వైపుgగానడిపించాడు. తరువాత 1928 లో హిందూస్తాం రిపబ్లికం అసోసియేషం సైనిక విభాగం హిందుస్తాన్ రిపబ్లికన్ ఆర్మీని ప్రారంభీంచి దానికి నాయకత్వ బాధ్యతలు చేపట్టడం , ఆగస్టు 8 నాడు ఢిల్లీ ఫిరోజ్ షా కోట్ల మైదాన౦లో జరిగిన హెచ్ ఆర్ యె సమావేసంలో స్వాతంత్ర్యాన్ని ,సోషలిజాన్నీ భరతదేశపు లక్ష్యాలుగా ప్రకటిచడ౦తో నాటి కాంగ్రెసు వాదులకు కంటగింపయింది. ఏప్రిల్ 8, 1928 నాడు ఢిల్లీ సెంట్రల్ అసెంబ్లీలో బాంబులు వేసి, ఎర్ర కరపత్రాలు పంచి స్వచ్చందంగా అరెస్టు కావడం.

భగత్ సింగ్ తాను రాసిన అనేక వ్యాసాలు, ఉత్తరాల ద్వారా తాను నాస్తికున్నని సోషలిస్టు విప్లవకారుడుగా నిరూపించుకున్నాడు.నిరంతరం జైలులో కూడా కా.లెనిన్ రచనలు అధ్యయనం చేసేందుకు తద్వారా భారత దేశవిముక్తి పోరాటాన్ని నడిపించెందుకు ఆసక్తి చూపారు. రష్యా దేశానికి పరిశీలకునిగా తన మిత్రుడ్ని పంపించాడు.

దీనివలన ఆయన బ్రతికి వుంటే ఈదేశపు స్వాతంత్ర్య కాంక్ష విప్లవ పథం వైపుగా నడిచి కార్మిక వర్గ తిరుగుబాటుగా రూపాంతరం చెంది తమ వ్యాపార వర్గ పునాదులు పెకలింపబడతాయని భయపడిన నాటి బ్రిటిష్ మరియు భారత పెట్టుబడిదారీ వర్గం తమ ఏజెంటు అయిన గాంధీ ద్వార కనీస ప్రజాస్వామిక వత్తిడి రాకుండా జాగ్రత్త పడి ఇర్విన్ ఒడంబడికను కుదుర్చుకొని అదే నెలాఖరులో రహస్యంగా ఉరితీయించింది. ఇది చరిత్ర చెప్పిన నెత్తుటి నిజం. గాంధీలో దాగివున్న వ్యాపార వర్గ అనుకూల వాది సంఘటనతో బయటపడ్డాడు.

కా. భగత్ సింగ్ చూపిన విముక్తి మార్గం నేటికీ సజీవమై ముందుకు సాగుతున్నది. నేడు ఎందరో యువ కిశోరాలు తమ నెత్తుటి త్యాగాలతో భగత్ సింగ్ వారసత్వాన్ని కొనసాగిస్తున్నారు. వారికి మన విప్లవ జోహార్లు అర్పిద్దాం. ఇంక్విలాబ్ జిందాబాద్.

16, సెప్టెంబర్ 2009, బుధవారం

శ్రామిక వర్గ రచయిత లక్షణాలు – మాక్సిం గోర్కీ

పా్క్రోవ్స్క్ పట్టణంలోని ఒక సాంకేతిక పాఠశాల సాహిత్య బృంద సభ్యులకి రాసిన ఉత్తరం లోని భాగం:

“ ఏ లక్షణాలని బట్టి నిజమైన శ్రామికవర్గ రచయితని గుర్తించవచ్చు?” అని మీరు అడుగుతారు. అలాంటి లక్షణాలు చాలా వున్నాయని నేను అనుకోను. ఆ లక్షణాలు యివి:

మానవుణ్ణి ఆంతరికంగా, బాహిరంగా ఉభయత్రా పీడించే ప్రతిదాన్నీ, మనవుడి సామర్థ్యాలు స్వేచ్చగా పెరిగి అభివృధ్ధి చెందకుండా ఆటంకపరిచే ప్రతిదాన్ని క్రియాత్మకంగా రచయిత ద్వేషించడం;

సోమరిపోతులపట్లా, పరాన్నభుక్కులపట్లా, నీచుల పట్లా, ఇచ్చకాలమారుల పట్లా, అనేక రూపాల్లో వుండే ప్రతిదుష్టుడి పట్లా మొత్తంగా నిర్ధాక్షిణ్యమైన ద్వేషం వుండటం.

సృజనాత్మక శక్తికి ఆధారభూతుడుగా, సర్వకాల వస్తువులనీ ప్రపంచంలోని సకల అద్భుతాలనీ సృష్టించేవాడుగా, ప్రకృతి విపత్తులకి వ్యతిరేకంగ పోరాడేవాడుగా, తన భౌతిక శక్తులు నిరర్థకంగaావ్యయం కాకుండా వుండేందుకుగాను-వర్గ దేశపు పరిస్థితుల్లో ఈ వ్యయం విధిగా తెలివితక్కువ, పనికి మాలిన న్యాయంగaావుండేది- తన శ్రమవల్లా, శాస్త్ర సాంకేతిక జ్ఞానంవల్లా " విశ్వామిత్ర సృష్టి” చేసిన వాడుగా మానవుడిపట్ల రచయితకి గౌరవం వుండటం.

అహేతుక దోపిడీని, ఒక మనిషిమీద మరొక మనిషి పెత్తనాన్నీ పూర్తిగా తొలగించి వేసేటటువంతి నూతన జీవిత రూపాల సృష్టి ధ్యేయంగా కల స్మష్టి శ్రమని రచయిత కవితాత్మకం చేయడం.

శారీరక సౌఖ్యప్రదాయినిగా కాకుండaాజీవిత కష్టభూయిష్ట పథంమీద విశ్వాస పాత్రమైన సహచరిగా, సహాయకురాలిగా్ స్త్రీల పట్ల రచయిత దృక్పథం వుండటం.

పిల్లల పట్ల బాధ్యతaాదృష్టి వుండటం, మనaంచేసే ప్రతిపనికి మనం వాళ్ళకే బాధ్యులం అనే వైఖరి వుండటం.

జీవితం పట్ల పాఠకుల క్రియాశీల దృష్టిని పెంచి, శ్రమ సంతోషాన్నీ దాని మహత్తర ప్రాముఖ్యాన్ని జీవితపు మహత్తర భావాన్నీ అర్థం అవకుండా అడ్డగించే ఆంతరికమైన, బాహిరమైన దాన్నంతటినీ జయించేటువంటి తమ సామర్థ్యం పట్లaాతమ శక్తి పట్లా, వాళ్ళకి విస్వాసాన్ని కలిగించేందుకు రచయిత ప్రయత్నించడం.

యిది సూక్ష్మంగా శ్రామిక ప్రపంచానికి అవసరమైనర్ అచయితని గురించి నా అభిప్రాయం.మీరు నిజాయితీపరులైన వాళ్ళు కావాలంటే విప్లవకారులు అవాలి.

" అమ్మ " నవల ఫ్రెంచి అనువాదానికి ముందుమాటలో:

శ్రామిక వర్గం ఎంతో రక్తాన్ని చిందిస్తోంది. కాని దాని పాక్షికమైన ఓటములూ, విజయాలూ దాని బ్రహ్మాండమైన పెరుగుదలని యింకాస్పష్టంగా సూచిస్తున్నాయి;దాన్ని ప్రపంచ పోరాటం కోసమూ, సతృవుమీద యీ మహత్తర, విషాదకర దినాల్లో అధికారaంకోసం, నియంతృత్వం కోసం శ్రామికవర్గపు పోరాటంలో నిజాయితీ గల విప్లవ రచయితల కృషి విప్లవాత్మక వర్గ చైతన్యపు అభివృద్ధి మార్గం కోసమే సంపూర్తిగaాఅంకితం కావాలి; ప్రపంచ పెట్టుబడిదారులకి వ్యతిరేకంgగాప్రపంచ శ్రామికులని వ్యవస్థీకరించి, సంఘటితపరచడానికే అంకితం కావాలి; విప్లవకర శ్రామికవర్గపు నిర్మూలనే అప్రకటిత లక్షYaMga aగల యుధ్ధానికి వ్యతిరేకంగా పోరాడే్దాని కోసమే అంకితం కావాలి; బూర్జువావర్గపు నైచ్యాన్నీ, నీతిబాహ్యతని, నేర స్వభావాన్నీ వెల్లడి చేసే, సిర్దాక్షిణ్యంగా బట్టబయలు చేసేదాని కోసమే అంకితం కావాలి. బూర్జువా వర్గం శ్రామికుల్ని క్రూరంgగానాశనం చేస్తోంది – బూర్జువాలపట్ల శ్రామికుల ఆలోచనకీ, దిశకీ గలక్ రూరత్వం యింకా యెన్నో రెట్లు పటుతరంగా వుండాలి.

ప్రతి రచయిత  “ తన హృదయ సర్వశక్తులతోటి మనుషులందరికీ వర్తించే మహత్తర సత్యాన్ని బోధించే ప్రజలు దాన్ని దర్శించేట్టు “ చేసే “ నిజాయితే గల పోరాట వీరుడు, సత్యం కోసం ఆరాటపడేవాడు” కావాలి.

13, సెప్టెంబర్ 2009, ఆదివారం

ముసుగులు తొలగించిన మరణం

 

విరసం సీనియర్ సభ్యులు ఎn.వేనుగోపాల్ ను విరసం నుండి సస్పెండ్ చేస్తున్నట్లుగా విరసం కార్యదర్శి కా.పాణి పేపర్లో ప్రకటన ఇచ్చి సంస్థ పై వచ్చే విమర్శలను ఆపే ప్రయత్నం చేసారు. ఈ నెల ఆంధ్రజ్యోతిలో వేణు వై.ఎస్..చివరి పుట్టిన రోజు పేరుతో రాసిన వ్యాసంలో తనకు వై.ఎస్.తో వున్న అనుబంధాన్ని బహిరంగపర్చారు. దానిపై రోజూ వస్తున్న విమర్శనాస్త్రాలనుండి సంస్థను తద్వార తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నమే ఇది. సంస్థలో క్రియాశీలక సభ్యుడుగా వున్న వ్యక్తి, అదీ సిటీ యూనిట్లో వున్న వారి గురించి ఇంతవరకు తెలియని వ్యవహారంలా ఈరోజే దర్యాప్తు నివేదిక అందినట్లుగా చర్య ప్రకటించడం నా బోటి అల్ప ప్రాణికి మింగుడుపడని విషయం. ఎందుచేతనంటే వీరిద్దరూ చాలా క్లోజ్ గానే అన్ని కార్యక్రమాలు రుపొందిస్తారు. లోకమంతా చాన్నాళ్ళుగా వేణు కార్యకలాపాల గురించి తెలిసినా సరే తనకు తాను చెప్పినంతవరకు చర్యకాని విమర్శ కాని  చేపట్టకపోవడం నాయకత్వ లోపమే. తమ వర్గాన్ని కాపాడే ప్రయత్నమే. గొప్పవాళ్ళ తప్పులను కప్పి వుంచడం విప్లవ కార్యాచరణకు  విఘాతం కాదా? తమ రచనలు, ఉపన్యాసాలతో ఎంతోమందిని ప్రభావితం చేసినవారు తామ మాత్రం రక్షణ కవచాల వెనక సౌఖ్యాన్ని అనుభవిస్తూ ఎదుటి వారి త్యాగాలను కీర్తీంచి విప్లవాన్ని కూడా సరకుగా మార్చిన తీరు ఇంత చిన్నగా తేలిపోవడం జీర్ణించుకోలేం.

విరసం అధికార పత్రిక అరుణతారకు  ఆర్ధిక స్థోమత లేక నెల నెలా రాని స్థితి గత కొన్నేళ్ళుగా వుండగా పాలక వర్గ ప్రకటనల ఆలంబనగా సొంత పత్రిక వీక్షణం ప్రతినెలా మార్కెట్లోకి ఐదో తారీఖునకే వచ్చే పెట్టుబడి ఎక్కడిదని ఎవరూ ప్రశ్నించలే. తన సహచరి పై చదువుల నిమిత్తం అమెరికా వెళ్ళగా తానూ  మూడు నెలలు విహరించిన నాడు కూడా తన పట్ల సంస్థ మునుపటి గౌరవాన్నే చూపింది. ఇది సమంజసమా? మార్క్సిజం, లెనినిజం, మావో ఆలోచనా విధానం సూత్రంగా పనిచేసే సంష్తలో మేధో వర్గం గా వచ్చిన గుర్తింపును ఇలా మనం దుర్వినియోగం చేయవచ్చా? మనం అలవర్చుకోవలసింది కార్మిక వర్గ దృక్పథం అన్నది ఎదుటివారికి  చెప్పే నీతి  మాత్రమేనా? మన కార్యాచరణ వలన సంస్థ పై వచ్చే అపోహలను తొలగించగళమా? సంస్థ తన సభ్యుల ఆచరణ ద్వారానే గొప్పదవుతుంది. సంస్థ వేరు వ్యక్తులు వేరు కాదు. జర్నలిస్టులలో ఎంతోమంది అక్షరానికి బలయిన వారే మన ఆదర్శం కావాలి. ఒక ముంతజర్ అల్ జైదీ, దిస నాయగం, లసంత విక్రమతుంగే, మన అమరుడు రసూల్ …

6, సెప్టెంబర్ 2009, ఆదివారం

ఉపాధ్యాయులు – సామాజిక బాధ్యత

భారత దేశ సామాజిక పరిణామాలలో ప్రతి మలుపులోను ఉపాధ్యాయ వర్గం తమ వంతు కృషిని శ్లాఘణీయంగా అమలు పరిచింది. మన ఊహా చిత్రాలుగా మిగిలిన చరిత్రనందు కూడా నాటి గురువుస్థానంలో ఉన్న వారి మార్గ నిర్దేశంలోనే నాటి చారిత్రక పరిణామాలు జరిగాయని తెలుస్తోంది. నిరంకుశ రాజరిక పరిపాలనలను అంతం చేసేందుకు సామాన్య జనంనుండి నాయకులను చాణక్యులవంటి వారు తయారు చేసారని చదువుకున్నాం. ఇది మన భారతీయ సమాజం గర్వించగ్గ గురు స్థానం.

ఆ తరువాత బ్రిటిష్ వారి కంపెనీ పరిపాలన నుండి విముక్తి కోసం జరిగిన స్వాతంత్ర్య పోరాటంలో కూడా అనేక మంది తమవంతు కృషి చేసారు. ఆ తరువాత జరిగిన అధికార మార్పిడి అనంతరం దేశీయ బడాబాబుల చేతులలోకి వచ్చిన అధికారం సామాన్య జనానికి మరింతగా అధ:పాతాళలంలోకి నెట్టివేసే క్రమంలో వారి పక్షాన నిలిచి సాగిన, కొనసాగుతున్న ఉద్యమాలకు మొదటిగా నాయకత్వం వహించినవారు ఉపాధ్యాయ వర్గంలోంచి వచ్చిన వారే. వామపక్ష ఉద్యమాలకు మన ఆంధ్ర దేశంలో నాయకత్వం వహించినవారు ఉదా.:ఆదిభట్ల కైలాసం, వెంపటాపు సత్యం మొదలు కొండపల్లి  సీతారామయ్య, ఆ తరువాత ప్రస్తుత మావోయిస్టు పార్టీ కార్య్దర్శి గా వున్న గణపతి వరకు ఉపాధ్యాయులే. ఇందుకు కారణం వారికి సామాజిక పరిస్తితుల పట్ల దగ్గరగా చూసే అవాకాశం కలిగివుండటం, ప్రజలతో సాన్నిహిత్యం, గ్రామాలలో ప్రజలకు కలిగే సందేహాలను తీర్చే ఏకైక వనరుగా వారు వుండటం మూలాన ప్రజలపట్ల అంకిత భావంగల ఉపాధ్యాయులు సామాజిక ఉద్యమాలను ముందుకు తేవడానికి కృషి చేసారు.

కానీ మారిన నేటి పరిస్థితులలో ఉపాద్యాయులlలోమెజారిటీ వర్గం తమ ఖాళీ సమయాన్ని చిట్టీ వ్యాపారాలు చేయడానికి, వడ్డీ వ్యాపారాలునడపడానికి, పైరవీలు చేసి ఉత్తమ అవార్డులు కొట్టేయడానికి్ ఉపయోగిస్తూ గ్రామాలlలో ఏదో ఒక రాజకీయ పార్టీ తొత్తులుగా తయారయి, కులానికో సంఘాన్ని పెట్టుకుంటూ తమ సామాజిక బాధ్యతను  విస్మరిస్తున్నారు.  ప్రభుత్వ పాఠశాలలను నిర్వీర్యం చేస్తూ సొంత కాన్వెంటులు నడుపుతూ పేద విద్యార్ధులకు చదువును అందని ద్రాక్ష చేస్తున్నారు. ఇది అందరినీ ఒకే గాట కట్టి రాయడం కాదు. మెజారిటీ వర్గం పరిస్థితి.

దయచేసి ఉపాధ్యాయ మిత్రులు తమ సామాజిక బాధ్యతను గుర్తెరిగి, తమ జీతాలతో పాటు సామాన్య జనం వెతలపట్ల కూడా స్పందించి ముందుకు రావాలని వి్జ్ణప్తి చేస్తున్నాను.

4, సెప్టెంబర్ 2009, శుక్రవారం

మరో మారు షాజహన్ మరణించాడు


మొన్నటి నుండీ ఆంధ్ర ప్రదేశ్ అంతటా అలముకున్న కారు మబ్బులు నిన్నటి ఉదయానికి వీడిపోయాయి. కాని అవి తెలుగు ప్రజల మనసుపై తీవ్రంగా కమ్ముకున్నాయి. తమతమ రాజకీయ భావాలు ఏవైనా తాము నిత్యమూ ఏదో ఒక రూపంలో చూస్తున్న, వింటున్న మనిషి అర్ధాంతరంగా గగనతలం నుండి అంతర్ధానం కావడాన్ని జీర్ణించుకోలేకపోయారు. నిత్యమూ చిరునవ్వులు చిందిస్తూ తను అనుకున్నది నిర్ధ్వందంగా చేసుకుంటూ ముందుకు సాగిపోయే మొండిమనిషి మరి లేడన్న వాస్తవాన్ని అంత తొందరగా సున్నిత మనస్కులైన తెలుగు ప్రజానీకం అంగీకరించలేకపోయారు. ఇది మరో మిస్టరీగా మిగిలిపోయింది అందరి మదిలో. నమ్మినదానిని ఆచరించడం, నమ్ముకున్న వాళ్ళను ఎంత కష్టమొచ్చినా, అది తనకు ఎంత నష్టదాయకమైనా వాళ్ళకోసం ఎంతటి త్యాగమైనా చేసే మనిషి మరి కనరాడన్న సత్యం ఇంకా అసత్యంగానే నమ్ముతున్న వాళ్ళు అధిక శాతం ఉన్నరనడం కఠోర వాస్తవం. ఇంతమంది హృదయాలలో బందీగా వున్న వాడికి ఈ అకాల మృత్యువు నిజమైనదేనా అని నా సందేహం. నేను నా చుట్టూ వున్న సామాన్య జనం వ్యక్త పరుస్తున్న అనుమానాలను ఇక్కడ మీతో పంచుకుంటున్నా.
అ. తండ్రి మరణిస్తే తనకు కొన్ని తరాలకు సరిపోయే సిరి సంపదలు ఇచ్చిన వాడి ఆచూకీ
కోసం వేలాదిగా తరలి వస్తే తాను ఎందుకు రాలేదు?
ఆ. మీడియా ముందుకు నిన్నటి మధ్యాహ్నం వరకు కుటుంబ సభ్యులెవరూ కనబడరేం?
ఇ. శవపేటిక వద్ద స్టైలిష్ గా నిలబడి నవ్వుతూ అందరికీ చేతులుకలుపుతూ కొద్దిసేపు ఫోజులిచ్చి వెళ్ళిపోవడం తన ధీరోదాత్తతను వ్యక్తం చేయడమా?
ఉ. పిచ్చి జనం గుండె ఆగి, ఉరివేసుకొని, గొంతుకోసుకుని మరణించారు. మరి తన ఉప్పుతిన్న వాడెవడూ పోలేదే?
ఊ. అంతర్ధానమైన మరుక్షణమే ఢిల్లీలో తన అనుచరులను పంపి మంతనాలు సాగించిన వారసుడి నైజం
బయటపడలేదా?
ఋ. పార్ధీవ దేహం ఇంకా ఇంటికి రాకముందే అరువుకుక్కల మీడియా వాళ్ళ స్క్రోలింగులలో తమకు తాను తప్ప దిక్కులేదని తన అనుచర గణంతో ప్రకటనలు ఇప్పించుకోవడం చూస్తుంటె నా లాంటి అమాయక అనుమానపు జనం గుడ్లప్పగిస్తూ చూడడం తప్ప ఏమీ చేయలేని మాటాడలేని నిస్సహాయతను తిట్టుకుంటూ....
ౠ. సాయంత్రమయ్యేసరికి నూరుకుపైగా సంతకాలు రెడీ, దొంగఏడుపుగాళ్ళు ఒకపక్క ఓ మాకలల నేత పోయాడని అంటూనే, చివర్లో యువనేత తప్ప మరో దారిలేదని నిర్లజ్జగా ప్రకటనలివ్వడం జనం వెర్రిపప్పలనేగా?
ఎ. వారసత్వ రాజకీయాలను, అధికారాన్ని ఆమోదించడమేనా మన ప్రజాస్వామ్యం?

పైవన్నీ ఒక నిస్సహాయ తెలుగు వాడిగా నా అనుమానాలు మాత్రమేనయ్యా...
మనసెందుకో ఈ ఔరంగజేబును అంగీకరించలేకపోతోంది....