9, ఆగస్టు 2013, శుక్రవారం

ఆగస్ట్ - 9...


ఆగస్ట్ 9.. గత పదిహేనేళ్ళుగా అంటే 1998 నుండి నన్ను వెంటాడే రోజు.. గుండెనంతా దు:ఖం పట్టి జ్ఞాపకాలన్నీ తెరలు తెరలుగా కనుల ముందు కదలాడే రోజు. ఒడిసా రాష్ట్రంలోని కోపర్ డంగ్ అటవీ ప్రాంతంలోకి ఆంధ్రా గ్రే హౌండ్స్ ప్రవేశించి తెల్లవారుఝామున గ్రామాన్నంతా చుట్టుముట్టి విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఆదివాసీ చిన్నారులను, వారి పశు సంపదను కూడా గురి చూసి కాల్చి బీభత్సంగా ఆధునిక ఆయుధాలతోను గ్రైనేడ్స్ తోను దాడి చేసి 13 మంది అప్పటి పీపుల్స్ వార్ పార్టీ కళీంగాంధ్ర నాయకత్వాన్ని హత్య చేసారు. దేశంలోనే మొట్ట మొదటి సారిగా హెలికాప్టర్లనుండి వెతికి కాల్పులు జరిపిన సంఘటన ఇదే. ఒక పోలీసు స్టేషన్ పరిధి దాటి కేసు నమోదు చేయని శాఖ ఇలా వేరొక రాష్ట్ర భూభాగంలోకి చొరబడి కాల్పులు జరిపి హత్య చేయడం న్యాయస్థానంలో ప్రశ్నించినా జవాబు రాలేదు. ఇదీ ఈ రాజ్యంలోని నాలుగు కాళ్ళ న్యాయం. సరిహద్దులు చెరిపేసిన ఎదురుకాల్పులుగా కోపర్ డంగ్ మొదలయింది. 

ఏ ఆదివాసీ ప్రజల స్వేచ్చా స్వాతంత్ర్యాలతో ఈ దేశ విముక్తి ముడిపడి వుందో వారిని ప్రలోభ పెట్టే ఆదివాసీ మేళాలను వ్యతిరేకిద్దాం. 

ఆదివాసీ పోరాటాలకు సంఘీభావం తెలియజేద్దాం. 

అమర వీరుల ఆశయాలను కొనసాగిద్దాం.