11, జులై 2011, సోమవారం

మానవ మృగాలు

లంక మారణ హోమంలో ఒక జాతి మొత్తం నాశనం చేయబడిన తీరు చూస్తుంటే మనం ఏ కాలంలో వున్నామన్న ప్రశ్న ఉదయిస్తుంది.. ఇంత దారుణం జరిగినా మాటాడని ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్ కీ మూన్ కు అందుకే రెండో సారి పట్టం కట్టారా అనిపిస్తోంది.. మన దేశం నుండి వలస వెళ్ళి రెండో తెగ ప్రజలుగా అనేక విధాలుగా హీనంగా చూడబడ్డ వారిపై కనీస మానవత్వం చూపలేని ఈ దేశ పాలక వర్గం ఎంతకైనా తెగిస్తుందని తెలియవస్తోంది.. రాజీవ్ గాంధీ హత్య జరగడంతో ఆ దేశంలోని తమిళులపై జరిగిన దారుణ మారణ కాండను కనీసం ప్రశ్నించలేని మౌన ప్రేక్షకులైన ఈ దేశ పాలక వర్గం ఎంత కౄరమైనదో తెలుస్తోంది. ఒక జాతి మొత్తం తుడిచిపెట్టే దారుణాన్ని ఒడిగట్టిన దేశంపై కనీస మానవహక్కుల చట్టం గురించి మాటాడని అగ్ర రాజ్యాల అవకాశ వాదం ఇంకెన్ని బలిదానాలు కోరుతుందో? ఈ మారణ హోమం చూసిన వారికి ఎవరికైనా కడుపులో పేగులు నోట్లోకి రాక మానవు....చీ ఇంత నీచమైన కాలంలో బతుకుతున్నామా?




10, జులై 2011, ఆదివారం

తెలుగు వీర రత్నమా..




తెలుగు వీర రత్నమా

వెంపటాపు సత్యమా

ఆదిభట్ల కైలాసం
అందుకోండి జోహార్లు...

(జూలై-10 అమరులైన దినం)