8, ఆగస్టు 2016, సోమవారం

రాజ్యం మరో వికృత రూపం

నయీం ఎన్ కౌంటర్ రాజ్యం వికృత రూపానికి మరో ఉదాహరణ మాత్రమే. వాడుకున్నన్నాళ్ళు వాడుకొని ప్రజా సంఘాల నేతలను దారుణంగా హత్య చేయించి ప్రజలలో భయాందోళనలను సృష్టించిన రాజ్యం తన పెంపుడు పిచ్చి కుక్కను ఇన్నాళ్ళు చంకలో ఎత్తుకు తిరిగి ఈరోజు చంపి తామేదో ఘనకార్యం సాధించినట్లు చెప్తున్నారు. నయీంను మఫ్టీలో తామే కాపలా కాస్తూ ఇన్నాళ్ళు పోషించి వారి ద్వారా తమ రియలెస్టేట్ దందా నడిపి కోట్లు కూడబెట్టుకున్న రాజకీయ నాయకులు పోలీసులు ఇంక అక్కరలేదు అనుకున్న సమయాన ఇలా హత్య చేయడం తామేదో నిజాయితీపరులమన్న ముసుగు వేసుకునేందుకు చేసిన హత్య తప్ప మరేం కాదు. ఇది మీడియాలో ఓ మూడు రోజుల వార్త తప్ప ఇంకేం కాదు. మరల మరో పిచ్చివాడితో మొదలు పెట్టొచ్చు.

హతమైన వారికి వారి కుటుంబాలకు ఇది కాస్తా ఊరట కావచ్చు కానీ రాజ్యం ఇలా చేసే పగటి హత్యలను ప్లాన్డ్ కోల్డ్ బ్లడెడ్ మర్డర్సును సమర్ధించలేను.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..