23, నవంబర్ 2010, మంగళవారం

పౌరహక్కుల పురుషోత్తం అమర్ రహే..


పౌరహక్కుల పురుషోత్తంగా జనం గుండెల్లో దాగిన పురుషోత్తం హత్యగావి౦పబడి నేటికి దశాబ్దం అయింది. కానీ ఆయనను హత్యచేసినవాళ్ళు నేటికీ గుర్తింపబడలేదు. ఇదే రోజు ఆయనతో మా జిల్లాలో హక్కుల కార్యకర్త అరెస్టు గురించి ఆయనతో మాటాడిన గంటలోనే గుర్తుతెలియని (పోలీసుల అండతో) కిరాతక హంతక ముఠా ఆయనపై కత్తులతో దాడి చేసి ఆయన ఇంటికి దగ్గరలోనే హత్య చేసారన్న వార్త. హక్కుల కార్యకర్తలపై వరుసగా దాడులు జరిగాయి ఆ పాలనలో. గొ౦తులేని వారి తరపున నిలబడి రాజ్యాన్ని ప్రశ్నించడం నేరంగా మార్చిన రోజులు అవి. ప్రజల తరపున మాటాడే వారిని లేకుండా చేయడం ద్వారా భయానక వాతావరణాన్ని కల్పించి తమ నిరంకుశ పాలనను కొనసాగించే ప్రయత్నం చేసారు నాయుడుగారు. రాజ్యం, పోలీసుల అండతో ప్రైవేటు హ౦తక ముఠాలు తయారై బహిరంగ హత్యలు చేసాయి. నేటికీ ఈ ప్రజాస్వామ్య దేశంలో ఈ హత్యలెవరు చేశారన్నది పాలక వర్గం గుర్తించలేదు.

ఆంధ్ర
ప్రదేశ్ పౌరహక్కుల సంఘ రాష్ట్ర ఉపాధ్యక్షునిగా ఆయన రాష్ట్రంలో నాడు ఏమూల జరిగిన హక్కుల ఉల్లంఘనలపైనైనా వెంటనే స్పందించేవారు. తను హక్కుల కార్యకర్తగా, కమ్యూనిజాన్ని నమ్మిన వ్యక్తిగా తన జీవన విధానాన్ని నిబద్ధతతో సాగించి ఉద్యమకారులకు ఆదర్శ మూర్తిగా నిలిచిన పురుషోత్తంకు జోహార్లు..

1 కామెంట్‌:

  1. com| purushottam gaaru amar rahE.aayana oka naidu nunchi (paradesinaidu)tappinchukunna ,inko naidu chetilo (chandrababu)chanipovaalsi vachhindi.aayana purushulalo vuttamudu kaabatte aa vusuru tagili e naidu rajakeeya marana shayyapai vunnaadu.purushottamgaari laanti vaarini pogottukunna e samaajam poura,maanava hakkulane pogottukundi.

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..