స్మరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు
స్మరణ లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

17, జూన్ 2011, శుక్రవారం

ప్రొ.ఆర్.ఎస్.రావు గారికి జోహార్లు



ప్రముఖ మార్క్సిస్టు అర్థ శాస్త్రవేత్త, గణాంక శాస్త్రవేత్త ప్రొ.R.S.రావు గారు ఇక లేరు.. ఆయన అరుదైన మార్క్సిస్ట్ మేధావులలో ఒకరు, పీడిత ప్రజల పక్షపాతి, మార్క్సిస్ట్ ఉపాధ్యాయుడు ఈ మధ్యాహ్నం ఢిల్లీలో 1.40 PM కు చనిపోయారు.. ఆయన గోథలే ఇన్ స్టిటూట్, పూణే, ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిటూట్, కోల్ కతలలో పనిచేసి సంబల్ పూర్ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసారు. సామాజికార్థిక రాజకీయ పరిశీలకులుగా, ఉత్పత్తి శక్తుల నక్సల్బరీ పోరాట మార్గాలను విశ్లేషిస్తూ పుస్తకాలు రాసారు. ఉపన్యాసాలిచ్చారు. అభివృద్ధి-వెలుగు నీడలు (1990), Towards understanding Semi colonial Society (1995), కొత్త చూపు (2011) వెలువడ్డాయి..

ప్రొ.సోమేశ్వరరావుగా ఇటీవల ఒరిస్సా మల్కన్ గిరి జిల్లా కలెక్టర్ కిడ్నాప్ సమయంలో మధ్యవర్తిగా అందరికీ సుపరిచుతులు..

ఆయన లేని లోటు పూడ్చుకోలేనిది.. వరుసగా ఆ తరం మేధావి వర్గాన్ని కోల్పోతుండడం బాధాకరం..
ఆయనకు జోహార్లర్పిద్దాం...
(పోటోలో ఈ చివరి వ్యక్తి)

10, అక్టోబర్ 2009, శనివారం

రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు మన బాలగోపాల్


కా.బాలగోపాల్ వంటి మేధావిని సమయంలో కోల్పోవడం మనందరి దురదృష్టం. హక్కుల ఉద్యమ చుక్కాని లేని నావ అయ్యింది. రాజ్య హింస నేడు అనేక కొత్త రూపాలలో ప్రజలపై దాడులు చేస్తుంటే తాను ముందుగానే వాటిని తెలుసుకొని అందరిని జాగురూకులనూ చేసిన మహా దార్శనికుడు. ఆయన నిన్నటివరకు మనమధ్య తిరుగాడిన లివింగ్ లెజెండ్. సమకాలిన మార్క్సిస్టు సిద్ధాంతవేత్తలలో అత్యంత నిబద్ధత కలిగిన వారు. అణగారిన ప్రజల చేతిలో ఎక్కుపెట్టిన విల్లు.
బాలగోపాల్ గారితో నాకు ఎనభై ఏడు నుండి పరిచయం వుంది. డిగ్రీ చదివిన తరువాత అదే వూపులో పౌరహక్కుల సంఘం సభలకు తరచుగా హాజరయ్యేవాడిని. సార్ విశాఖ వస్తారని తెలియగానే వెళ్ళేవాడిని. ఆయన వున్నన్నాళ్ళు కలిసి వుండే వాడిని. వి.ఎస్. కృష్ణా (ఇప్పుడు మానవ హక్కుల వేదిక రాష్ట్ర కార్యదర్శి) గారి ఇంటిలో బసచేసేవారు. కృష్ణ జే.ఎన్.యు.నుండి వచ్చిన కొత్తలో చాలా ఇటరెస్టి౦గ్ గా వుండే వాడు. పుస్తకాలు పై చర్చలు జరిగేవి. రోజుల్లో ఎక్కడ ఎదురుకాల్పులు జరిగినా, వరకట్న హత్యలు జరిగినా, దళితులపై దాడులు జరిగినా సార్ వెంటనే వచ్చేవారు. పౌరహక్కుల సంఘానికి తానె అన్నిఅయి పనిచేసేవారు. ఎంతటి ఇ౦టీరియల్ ప్లేస్ అయినా ధైర్యంగా వెళ్ళే వారు. నిజనిర్ధారణ కమిటి పేరుతొ మిగతా సంఘాలను కూడా కలుపుకొని అక్కడి పరిస్థితులను లోతుగా అధ్యయనం చేసేవారు. సమస్య ఎక్కడ వుంటే అక్కడ బాలగోపాల్ వస్తారని అంతా ఎదురుచూసేవారు. పోలీసులకు నిద్ర పట్టేది కాదు. దాంతో తనపై రాజమ౦డ్రిలో దాడి చేసి చ౦పబోయారు. దగ్గరలో వున్న ప్రజలు కాపాడడ౦తో తలపై బలమైన గాయంతో బయటపడ్డారు. తరువాత రాజ్యహింస తో పాటు ఉద్యమ హింసను కూడా వ్యతిరేకించాలనే తీర్మానంతో ఆయన సి.ఎల.సిలో చర్చ పెట్టారు. కాని ఒక బలీయమైన రాజ్యంతో పోరాడుతున్న క్రమంలో ఇన్ఫార్మర్ వ్యవస్థను అమలుచేస్తూ ఉద్యమం మనుగడకు ముప్పు వాటిల్లినప్పుడు తప్పని సరై వాళ్ళని మట్టు పెట్టడంను, రాజ్యం అత్య౦త పాశవికంగా దాడులు చేస్తున్నప్పుడు వారి బలగాలను అడ్డుకోవడానికి పోలీసులనుకూడా మందుపాతరలతో చంపక తప్పని స్థితిని హింసగా పేర్కొనడాన్ని మెజారిటి సభ్యులు వ్యతిరేకించడంతో తాను పౌరహక్కుల సంఘం నుండి బయటకు వచ్చి మానవ హక్కుల వేదికను ఏర్పాటు చేసుకున్నారు. అయినా సరే పోలిసులు సాగించిన కట్టుకథల ఎదురుకాల్పుల స౦ఘటనలకు వెంటనే స్పందించేవారు. రాజ్యానికి ఎప్పుడూ లోకువ కాలేదు. పూర్తికాలం హైకోర్టు న్యాయవాదిగా వుంటూ పేదల పక్షాన అనేక కేసులు వాదిస్తూ వారికి న్యాయాన్నిఅతి తక్కువ ఖర్చులూ అందుబాటులోకి తేవడానికి తన శాయశక్తులా కృషి చేసారు. మద్యన విజయనగరం జిల్లాలోని రాష్ట్రంలోనే అతి పెద్ద జూట్ మిల్లుగా పేరుగాంచిన నెల్లిమర్ల కార్మికుల జీతాలపై వారికి అనుకూలంగా తీర్పు తెచ్చారు. అలాగే లాకప్ డెత్లు ఆనాడు విరివిగా జరిగేవి. ఎవరూ పోలీసులకు వ్యతిరేకంగా మాటాడని రోజుల్లో తాను నిజనిర్ధారణ చేసి అనేక కేసులను హైకోర్టు వరకు తీసుకుపోయి అధికారులను వెంటనే సస్పెండ్ చేసి దర్యాప్తు జరిగేట్లు చేయడానికి ఆయనే కారణం. అలాగే మరణించిన ఉద్యమకారుల పార్థీ శరీరాలను అతి దయనీయంగా పోలిసులు పాతేస్తూ, కిరోసిన్ పోసి కాల్చేస్తూ చివరి స౦స్కారానికి కూడా వారి బంధువులకు అవకాసం లేకుండా చేసేవారు. అలాగే పోస్టుమార్ట౦ తంతు కూడా వారికి అనుకూలంగా చేసుకునేవారు. వీటిపై కన్నాభిరాన్ గారితో కలిసి హైకోర్టులో పోరాడి సుప్రీం కోర్టు తీర్పునకు లోబడి పోస్టుమార్టం కూడా నిపుణులైన డాక్టర్ల బృందంతో వీడియో తీస్తూ జరిగేట్టు కృషి చేసారు. గిరిజన ఆదివాసి ప్రా౦తాలలో ప్రతియేడు జరుగుతున్నా విషజ్వరాలపై వారి తరపున అలుపులేని పోరాటం చేసారు. అలాగే ప్రభుత్వం తూర్పు గిరిసీమలలోని బాక్సైటు ఖనిజాన్ని కొల్లగొట్టి ప్రైవేటు కంపెనీలకు అమ్మేదానిపైనా అల్యుమినా ఫ్యాక్టరీ పెడితే కలిగే అనర్దాలపైన తీవ్రమైన పోరాటానికి వెన్నుదన్నుగా నిలిచారు. అలాగే ద౦డ కారణ్యంలో సల్వాజుడుం పేరుతొ ఆదివాసి తెగలమధ్య పెట్టిన కార్చిచ్చుతో జరుగుతున్నా అమానవీయ హింసకు వ్యతిరేకంగా తను సొంతంగా పర్యటించి వ్యాసాలూ రాసి, సుప్రీం కోర్టులో కూడా పిటిషన్ వేసి పోరాటం చేస్తున్నారు. రాజ్యం పౌరుల హక్కులను హరి౦చే ప్రతి అంశంను న్యాయస్థాన౦ దృష్టికి తేవడానికి తద్వారా అభాగ్యులకు అ౦డగా నిలవడానికి అహర్నిశలు తన ఆరోగ్యం క్షీణిస్తున్న కృషి చేసిన నిరాడంబర జీవి. ఏనాడు అవార్డుల కోసం ఎదురుచూడని మనిషి. మద్య ఇస్తున్న రామన్ మాగాసేసే అవార్డు గ్రహీతలను చూస్తుంటే నవ్వు వస్తుంది. రాజ్యానికి అనుకూలంగా వున్న వారికి ఇలాంటి సత్కారాలు లభిస్తుంటాయి. అవి రాకపోవడమే బాలగోపాల్ నిబద్ధతకు తార్కాణం. తన చివరి ఉపిరి వరకు పేదల, దళితుల పక్షాన నిలిచి తన జీవిత సర్వస్వాన్ని ధారపోసిన మనిషి మరి లేకపోవడం హక్కుల ఉద్యమానికే కాదు శ్రామిక, కార్మిక ఉద్యమాలకు, విప్లవోద్యమాలకు తాడిత, పీడిత ప్రజలకు తీరని లోటు. ఇది ఇప్పట్లో భర్తీ అయ్యేది కాదు. పూర్తికాలం తనలా జీవితాన్ని అంకితం చేసిన మానవీయ కార్యకర్త, మేధావి ఉద్యమానికి దొరకడం చాలా కష్టం. తాను ప్రొఫెసర్ గానే కొనసాగి, గణితం లోనే పరిశోధనలు సాగించి ఉంటే భారత దేశానికి రంగంలో నోబెల్ తెచ్చేవార౦ట, అంతటి మేధావిని ఇంత తొందరగా కోల్పోవడం మనందరి దురదృష్టం. ఆయన రాజ్యం ఉక్కుపాదంలో దిగబడిన ముల్లు.