20, ఆగస్టు 2009, గురువారం

శోకపల్లి కంట నీరు తుడిచేదెవ్వరు


విశాఖ ఏజెన్సీలో గల జి.మాడుగుల మండలం సుర్మతి పంచాయతీ పరిధిలోని వాకపల్లి గిరిజన మహిళలు పదకొండు మందిపై ఇదే రోజు రెండువేల ఏడవ సం.లో గ్రేహౌండ్స్ పోలీసులు అత్యాచారానికి పాల్పడ్డారని వారు బహిరంగంగా తమ గోడు వెళ్ళబోసుకున్నా నాటి నేటి ముఖ్యమంత్రి కనీసం వారి పట్ల సానుభూతి చూపలేదు సరికదా వారిని తిరిగి పోలీసు చర్యలను అడ్డుకున్నారని అన్యాయంగా కేసులలో ఇరికించి కోర్టుల చుట్టు తిప్పుతున్నారు. ఇది గుడ్డి ప్రభుత్వం, మేము సిగ్గు విడిచి చెప్పుకున్నా మాకు న్యాయం జరగలేదని నేటికి బాధిత మహిళలు వాపోతున్నారు. ఇక బయట తిరగలేక గ్రామానికే పరిమితం కావాలని వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఆనాడు వారు అలా చెప్పుకున్నందుకు కులపెద్దలు వేసిన తప్పు ఐ.టి.డి.ఏ.ద్వారా కొంత నగదును ప్రభుత్వం చెల్లించింది. ఇది నేరాంగీకారం కాదా? గిరిజన మహిళలయినందున వారి పట్ల ఎవరికీ సానుభూతి తప్ప జరిగిన అన్యాయానికి తగిన శిక్ష పోలీసులకు పడేట్లు చేయడంలో రాజకీయ పార్టీలు విఫలమయ్యాయి. వారి ఓటు శాతం తక్కువయినందున వారి పట్ల తగిన పరిష్కారంనకు కృషి జరుగలేదు. ఎన్నికల వాగ్ధానాలు తప్ప అమలుకు కృషి జరగలేదు. వాకపల్లి గిరిజన మహిళల శోకాన్ని ఆపేదెవరు? వారి కంట నీరు ఆగేదెన్నడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..