24, ఏప్రిల్ 2011, ఆదివారం

సంతాప దినాలు ఎవరికి??

సాయిబాబాను నెలరోజులుగా కుళ్ళబెట్టి రోజుకి సెటిల్మెంటులన్నీ పూర్తయి అంతా సర్దుకున్న తరువాత మరణించినట్లు ప్రకటించి ప్రభుత్వం 3 దినాలు సంతాపం, రెండు రోజులు సెలవు ప్రకటించింది..

భగవంతునిగా తనను తాను ప్రకటించుకొని ఆడంబరమైన జీవితం గడిపి, బడా వ్యాపారస్తులకు, రాజకీయ నాయకులకు అండదండలిస్తూ సంపాదించిన దాంట్లో కొంత భాగాన్ని విద్యా వైద్య సౌకర్యాలకు వెచ్చించి మిగిలిన ఆదాయానికి లెక్కలులేని విలాసపురుషుడు మరణిస్తే సెక్యులర్ దేశంగా ప్రకటించుకున్న పాలకులు సంతాప దినాలు ప్రకటించడం సమంజసమా?

ఇప్పటికే ఉప ఎన్నికల ప్రభావంతో పాలన స్తంభించిపోయింది..
ఇంకా రక రకాల కారణాలతో సెలవులనుభవించే కార్యాలయాలకు సెలవులు ప్రకటించడం న్యాయమా?

కోట్లాది రూపాయల నల్లధనం, బంగారం ఇంతకాలం దాచుకున్న మోసగాళ్ళ నిలయం పుట్టపర్తి.. ట్రస్టు సభ్యులుగా వున్న వారంతా కారణమూ లేకపోతే ఇంత కాలం దాగుడు మూతలాడతారు?
అదేమైనా స్వతంత్రం ప్రకటించుకున్న నగరమా? రాష్ట్రప్రభుత్వం చేష్టలుడిగి చూస్తూ వున్నదంటే?

ఇన్నాళ్ళుగా దాచుకున్న బంగారం, నల్ల డబ్బు తరలిపోయాక ఇప్పుడు శవాన్ని చూపించి వార్తా చానళ్ళ నిండా లైవ్ షో లిస్తూ ప్రజలను మోసపుచ్చడం కాదా?
ఇన్నాళ్ళు ఇంత దాపరికం దేనికి?
ఇవన్నీ భేతాళ ప్రశ్నలుగానే మిగిలిపోతున్నాయి..

2 కామెంట్‌లు:

  1. సంతాప దినాలిచ్చినందుకు సంతాపం వెలిబుచ్చుతున్నాను. ఈ ప్రభుత్వానికీ సంతాపం ప్రకటించాలిక.

    రిప్లయితొలగించండి
  2. manishi devudetla ayithdu,aa devuniki rogaletla vasthai malla aa devudetla sachipothdu..idantha gammathi unnadi...

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..