17, జూన్ 2009, బుధవారం

చారు బాబు నవ్వాడు


పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లా లాల్ఘర్ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకొని వందలాది గిరిజనులు పోలీసు దాడులప్రతిఘటనా కమిటీ గా ఏర్పడి గత నాలుగురోజులుగా స్థానిక సి. పి. ఎం. కార్యాలయాలను తగులబెట్టి ప్రభుత్వ కార్యాలయాలను స్వాధీనపరచుకొని పోలీసులు, ప్రభుత్వ పారామిలటరీ దళాలు రాకుండా రోడ్లాన్నీ దిగ్బంధం చేసినారని వార్తా కధనాలు వస్తున్నాయి. టి. వీ.లలో కూడా చూపిస్తున్నారు. స్థానిక మావోయిస్టు నాయకుడు బుధదేవ్ ను ప్రజల తీర్పుమేరకే హత్యచేసేందుకు మందుపాతర పెల్చామని ఇంటర్వ్యూ ఇచ్చాడు. మార్క్సిస్టు కార్యకర్తల ఆగడాలు పెచ్చరిల్లి, ప్రభుత్వ పోలీసు దళాలు వారికి అండగా నిలవడంతో ప్రజలు ప్రతిఘటన రూపాలను మార్చుకున్నారు. పోలీసు వేధింపులకు నిరసనగా ఇక్కడి గిరిజనులు పీపుల్స్ కమిటీ పేరిట ఉద్యమిస్తున్నారు. ప్రజలు మరో నక్సల్బరీ ఉద్యమం వైపు అడుగులేస్తున్నారు. ఇది ఆహ్వానించవలసిన విషయం. ప్రస్తుత పార్లమె౦టరీ ప్రజాస్వామ్య ప్రభుత్వాల పరిపాలనలో వీటికి ప్రత్యామ్నాయంగా ప్రజల వైపు నిలబడుతున్నడి మావోయిస్టు పార్టీ మాత్రమేనని నిరూపితమవుతో౦ది. ప్రస్తుత పాలక పార్టీలన్నీ వాళ్ల వాళ్ల వ్యాపారాలకు నశ్ట౦ రాకు౦డా ఒప్ప౦దాల మద్య పాలన సాగిస్తూ అమెరికన్ సామ్రాజ్య వాదుల తొత్తులుగా తయారయిన క్రమ౦లో ప్రజలు ప్రత్యామ్నాయ రాజకీయాలవైపు రాక తప్పదు. సెజ్ ల పేరుతొ వ్యాపారా సామ౦త రాజ్యాలనేర్పాటు చేసుకు౦టున్న పాలక వర్గాలు రైతా౦గాన్ని వ్యవసాయర౦గ౦ను౦డి తాపి౦చి కూలి జన౦గా మార్చుతూ తమ దోపిడీని నిరాట౦గా కొనసాగి౦చే౦దుకు కోబ్రాలు పేరిట ప్రత్యెక దళాలను తయారు చేస్తూ క్రూర నిర౦కుస చట్టాలను ప్రయోగి౦చడానికి ఉద్యుక్తులవుతున్న క్రమ౦లో ప్రజల ను౦డి మరిన్ని ప్రతిఘటనా పోరాటాలు పెల్లుబుకుతాయి.
(ఆ౦ద్రజ్యొతి లో వార్తకు స్ప౦దనగా)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..