15, జూన్ 2009, సోమవారం

మృగాళ్ళ రాజ్యం

మృగాళ్ళాంటి మగాళ్ళు సంచరించే లోకమిది! నదివీధిలోనైనా, నట్టింట్లోనైనా ... మగువకు రక్షణ లేదని మరోమారు రుజువైంది. రాష్ట్రంలో అబలలపై జరుగుతున్న దారుణాలకు అంతులేకుండా పోతోంది. నిన్నను అనంతపురం, నెల్లూరులలో జరిగిన సంఘటనలు మరీ భయనకంగా వున్నయి. స్త్రీలపై దాడులు మరింతగా మహిళా గృహమంత్రి పాలనలోనే అధికంవడం వారి దురద్రుష్టం. అనంతపురంలొ బహిరంగ మార్కెట్లొ భర్త చూస్తుండగానె ఆటోలొ ఎత్తుకుపోయి అత్యాచారం చేసారు. ఈవిషయాన్ని అటుగా వస్తున్న పోలీసు వారికి చెప్తే అది తమ పరిధిలోని ఏరియా కాదని నిష్కర్షగా, నిర్లజ్జగా వెళ్ళిపోవడం ఎంతవరకు సమంజసం. రాష్ట్రాలు దాటి అరెస్టులు, ఎదురుకాల్పులు జరిపుతున్నప్పుడు తమ పరిధి గుర్తుకురాదు వీల్లకి. నెల్లూరులొ తన వాంచ తీర్చలేదని 15 యేల్ల బాలికను కెరోసిన్ పోసి ఒకడు చంపాడు. రోజు రోజుకు మహిలలపై దాడులు పెరిగిన తీరు బట్టి సమాజంలో పెరిగిపోతున్న నేరప్రవృత్తి, మనుషుల మనసులపై సినిమాల, సీరియల్ల ప్రభావం, దబ్బు, అధికారంలతో అమైనా చేయగలమనే ధైర్యం కలుగుతుండడం సమాజానికి మంచిది కాదు. దీనిని అందరూ గుర్తించి జాగరూకత వహించాలి.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..