16, ఏప్రిల్ 2010, శుక్రవారం

బాల్యం వీరికి శాపం అయ్యింది

ఒడిషా రాష్ట్రంలోని కోరాపుట్ జిల్లా నారాయణపట్నం బ్లాకులో గత రెండు సం.లుగా ఆదివాసులపై తీవ్రస్థాయిలో జరుగుతున్న దాడులు ఎవరి కంటా పడక మూగ రోదనగా మిగులుతున్నాయి. దీనిపై తెహెల్కా పత్రిక ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. యిక్కడి 15 సం.లు కూడా నిండని యువతీ యువకులను నక్సల్స్ పేరుతో అరెస్టులు చేస్తూ , వారి కుటుంబాలను తీవ్ర భయాందోళనలకు గురిచేస్తున్నారు. వారి తల్లిదండ్రుల ప్రశ్నలకు సమాధానం చెప్పే వారే లేరు. జనాభా గణనలో కూడా సరైన ప్రాతినిధ్యం లేని ఆదిమ తెగల దయనీయ పరిస్థితిని గురించి పాలకులు ఆలోచించిన పాపాన పోలేదు. ఏమైనా అంటే కోట్లాది రూపాయల నిధులు విడుదల చెస్తున్నాం అంటారు. అవి ఎక్కడికి పోతున్నాయో ఆ పెరుమాళ్లకే ఎరుక. యివేవి తమకు అక్కర్లేదు తమ గూడెంలో తమని బతకనిస్తే చాలుననే ఈ ప్రజల వేడుకోలు వినేవారెవ్వరు?
tehelka

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..