24, ఏప్రిల్ 2010, శనివారం

నైతిక మార్గదర్శి - సు.రా.




సు.రా. గా సుపరిచుతులైన సి.వి.సుబ్బారావు గారి గురించి రామచంద్ర గుహ గారి వ్యాసం ఈ దినం ఆంధ్రజ్యోతిలో వచ్చింది. ఈ సందర్భంగా సందిగ్ధ సందర్భం పేరుతో సు.రా. రచనల ప్రచురణలలో తన పరిచయాన్ని చేసిన మిత్రుల వాక్యాలు కొన్ని యిక్కడ...
సుబ్బారావుతో ఒక మేరకైనా పరిచయం ఉన్నవాళ్ళకి అతన్ని మరిచిపోవడం ఎంత కష్టమో, అతన్ని బొత్తిగా తెలియని వాళ్లకి కొత్తగా పరిచయం చెయ్యడం బహుశా అంతే కష్టం.
హేతువాదం పునాదిగా ప్రశ్నించడం ఆరంభించిన యువతీయువకులు చాలామంది నలుపునీ తెలుపునీ గుర్తించాక ఆగిపోతారు. పరస్పర విరుద్ధాల మధ్య ఉండే విశాలమైన "సరిహద్దులు దొరకని సంధ్యలలో" గ్రే ఏరియాస్ ని ప్రశ్నించి, మధించి, శోధించాడు సుబ్బారావు. అందుకే యాంత్రికమైన జవాబులు, పరిష్కారాలు అతన్ని తృప్తి పరచలేదు.
సుబ్బారావు పౌరహక్కుల ఉద్యమకారుడిగానే కాక ఆర్థిక శాస్త్రవేత్తగా, విద్యార్తులు ప్రేమించిన అధ్యాపకుడిగా గుర్తింపు పొందాడు. మావోయిస్టు చైనాలో ఆర్థికాభివృద్ధి మీద, నైజాం సంస్తానంలో పారిశ్రామికీకరణ మీద పరిశోధన చేశాడు. అలాగే ఈశాన్య రాష్ట్రాల్లో జాతుల సమస్య మీద అధ్యయనం చేసి 'రగులుకునే రాశ్ఖసి బొగ్గు' పుస్తకం రాశాడు. రాజకీయార్థిక శాస్త్రాన్ని తెలుగు పాఠకులకు పరిచయం చేశాడు. విరసంలో క్రియాశీల సభ్యుడు. "సృజన" సాహితీ మితృలలో ఒకడు. 'విభాత సంధ్యలు' తెలుగు సాహిత్య విమర్శలో ఒక అపూర్వ ప్రయోగం.
అతని కిష్టమైన మాటల్లో చెప్పుకోవాలంటే - "ప్రయాణారంచాన్ని మర్చిపోతే గమ్యం శిథిలమౌతుంది".

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..