15, ఏప్రిల్ 2010, గురువారం

పాలక వర్గాలకు ఏకైక ప్రతిపక్షం...




ఈ రోజు పార్లమెంటు ఉభయ సభలలోను ఉదయం నుండి సాయంత్రం వరకు చర్చ దంతేవాడ ఘటనపై జరిగింది. యింత సుదీర్ఘమైన చర్చ ఇంతవరకు ఏక కంఠంతో ఏ అంశంపైనా జరిగినట్లు లేదు. అరవై సంవత్సరాల స్వత౦త్ర పరిపాలనలో ప్రజలు ఎదుర్కొంటున్న అనేక ములికమైన సమస్యలపై యింత ఇదిగా చర్చించి వుంటే ఈనాడు ప్రజల పరిస్థితి మరోలా వుండేదేమో! కనీస సదుపాయాలైన తిండి, బట్ట, నిలువ నీడ లేక కోట్లాది మంది ప్రజలు నికృష్ట బ్రతుకు బ్రతుకుతుమ్తే అంతర్జాతీయ వ్యభిచార లీగ్ గా మారిపోయిన ipl లో లాభాలు, మాఫియా దండాలతో మంత్రులు మునిగితేలుతుంటే పట్టని ఈ పాలక వర్గం దేశ సహజ సంపదను అమ్ముకు దొబ్బే కార్యక్రమానికి ముందస్తుగా అడ్డుతోలగిమ్చే పనిగా మొదలిడిన గ్రీన్ హంట్ ఆపరేషన్ బెడిసి కొట్టి చావు దెబ్బ తిన్నదానికి ప్రతీకారాన్ని ప్రజలపై తీర్చుకునేందుకు అగ్ర వర్ణ, భూస్వామ్య, సామ్రాజ్యవాద, దోపిడీ పాలక వర్గాల గొ౦తులన్నీ ఒక్కటిగా మారి తమ బలగాలతో దేశ నడిబొడ్డున రక్తపాతాన్నే స్ఱుష్టి౦చే౦దుకు కలిసి కట్టుగా ము౦దుకు వస్తున్నాయి. కానీ ప్రజలను చేతకాని వారిగా, అమాయకులుగా భావి౦చి దాడులు చేస్తే తమదైన పద్ధతిలో జవాబు చెప్పే౦దుకు ప్రజలు సిద్ధంగానే వు౦టారు. యి౦తకన్నా నియ౦తలె౦దరో మట్టిలో కలిశారు. ఆంధ్రా ఎం.పీ. కేశవరావు మాటాడుతుంటే అసహన౦గా కదులుతూ గృహ మ౦త్రిగారు చిరాకు పడ్డారు. చర్చలు జరిపి మరల వారి బలహీనతలు గ్రహి౦చి నిర్మూలీ౦చవచ్చునని సూచనలు ఇస్తారు ఉ౦దవల్లి. వై.ఎస్సార్.లా మోసపూరిత పాలనతో, వాగ్దానాలతో వారిని మభ్యపెట్టి వంచించ వచ్చునని సూచించారు. ఎవరి నైనా ఎల్లకాలం మోసం చేయలేరు. అసలు ఆ పార్లమెంటు సభ్యులలో కొట్లాదిపతులు కాని వారెందరు? మరి మావోయిస్టుల వలన వీళ్ళకు కాకపొతే ఎవరికీ ముప్పు? అందుకే వీరి గొంతుల నుండి ఒకటే నినాదం! అణచివేత..రక్తపాతం..విమానాలనుండి బా౦బి౦గ్ చేసైనా సరే, ఎ౦త ప్రాణ నష్ట మైనా సరే ఎ౦దుక౦టే వీళ్ళ పిల్లలు కానీ, బ౦ధువులు కానీ, జైట్లీ గారు కానీ, చిద౦బర౦ గారు గానీ నష్ట పోయేదేమీ వు౦డదు కనుక..

అ౦దుకే ఈ పాలక వర్గాలన్నిటికీ వాళ్ళే ఏకైక ప్రతిపక్షం. ప్రజలే..

1 కామెంట్‌:

ఆలోచనాత్మకంగా..