25, మే 2011, బుధవారం

వసంత మేఘ గర్జన..


తూరుపునుండి
వీచిన ఓ వడగాడ్పు
దేశాన్ని మొద్దు తనంనుండి
తట్టిలేపి బక్క రైతు చేతిలోని
కొడవలే ఆయుధంగా
నలుదిశలా ఎలబారి
పెట్టిన పొలికేక అది..

విముక్తి కోసం
వేసిన మొదటి అడుగు...
అది నేడొక ఊరి పేఋ మాత్రమే కాదు
నక్సల్బరీ నేడు సర్వనామమైంది...

సిక్కోలు ఆదివాసి చేతిలో
నాటు తుపాకీ పేలింది
సావుకారి గుండెల్లో
గునపం దిగింది
ఇక్కడ మరో ఏనాన్ వెలిగింది....

వసంత మేఘ గర్జన
దేశమంతా వినబడింది
దోపిడీ దారుల గుండెల్లో
పిడుగు పడింది....

ఎఱ కోట బీటలు వారింది
అంతా అణగి మణగి పొయిందనుకున్న
నక్సల్బరి ఫీనిక్స్ పక్షిలా
రెక్కలల్లారుస్తూ
లేస్తూనే వుంది

దండకారణ్యం నేడు విముక్తి నగారా మోగిస్తోంది...

(నక్సల్బరీ రైతాంగ పోరాటానికి నేడు నలబై నాలుగేళ్ళవుతున్న సందర్భంగా)

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

ఆలోచనాత్మకంగా..