29, మే 2010, శనివారం

వారిపై నెట్టాలని చూస్తారా?



నిన్న ప.బెంగాల్ లో జరిగిన రైలు ప్రమాదానికి మావోయిస్టులే కారణమని అంతా వారిపైకి నెట్టాలని చూసారు. కానీ అది తా్ము చేసింది కాదని వాళ్ళు ప్రకటించారు. యిదంతా అక్కడ రాబోయే ఎన్నికల వ్యూహంలో భాగంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తమ అధికార యంత్రాంగ వైఫల్యాన్ని వారిపై నెట్టివేస్తె ఒ పనైపోతుంది. మరింత కౄరంగా ఆదివాసీ్లపైనా, వారి్పైనా దాడులు చేసి రాబోయే ఎన్నకల నాటికి అడ్డు లేకుండా చేసుకోవచ్చని సిగ్గు విడిచి ప్రకటించాయి. కానీ మావోలు దీనిని తిప్పి కొట్టారు. ఆ తరువాత రైల్వే మంత్రి గారు ఇది వాళ్ళు చేసి వుంటారనుకున్నాం, కానీ దీనిపై సి.బి.ఐ.దర్యాప్తు జరిపిస్తామని ప్రకటించారు. ఐఇడిలు వాళ్ళ ఒక్కరి వద్దే వున్నాయా? యిటువంటి విద్రోహ చర్యలు జరుగకుండా తగిన జార్గత్తలు తీసుకోలేరా? రైల్వే ట్రాక్ సిబ్బంది ఏమయ్యారు? ఇది అధికార యంత్రాంగ వైఫల్యాన్ని కప్పి పుచ్చే యత్నం.

ఒకరిపై ఆరోపణ చేసే ముందు అన్ని కోణాలలో పరిశీలించాల్సిన అవసరం వుంది. గుడ్డెద్దు చేలో పడ్డట్లు అధికారం వుంది కదా అని ప్రవర్తించ కూడదు.

4 కామెంట్‌లు:

  1. >>>కానీ అది తా్ము చేసింది కాదని వాళ్ళు ప్రకటించారు.
    అలా అని వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చారా?? మీడియా లో ఇంతవరకూ అలాంటి వార్త రానే లేదు.. మీరు టీ.వీ. లో చూశారా?? నాకు ఇంటర్నెట్ లో ఎక్కడా మీరు చెప్పిన వార్త కనిపించలేదు..

    రిప్లయితొలగించండి
  2. ఈరోజు ఈనాడు, ఆంధ్రజ్యోతి మైన్ లో చాంద్ పేరుతో ప్రకటన వచ్చింది. టీవీ వార్తలలో కూడా చెప్పారు.

    రిప్లయితొలగించండి
  3. http://ibnlive.in.com/news/sorry-we-attacked-the-wrong-train-pcpa/116651-3.html?from=trhs

    varma gaaru,, what do you say now???

    oka anna kaakapote maro anna..

    రిప్లయితొలగించండి
  4. సహచరుడు గారికి నమస్కారాములు..బ్లాగ్ లో మీరు రాస్తున్న వాటిని రెగ్యూలర్ గా చదువుతున్నాను..చాలా బాగుంటున్నాయి..చాల రోజుల నుంచి మీకు రీప్లయ్ ఇద్దామనుకుంటు సమయాభావం వలన రీప్లయ్ ఇవ్వలేకపోయను..ఇదిగో ఇన్నాళ్లు పట్టింది రీప్లయ్ ఇవ్వడానికి...అన్నట్టు నేను నాతో పాటు మామిత్రులం కలిసి ఉస్మానియా యూనివర్షిటి నుండి "క్యాంపస్ వాయిస్" అనే మాసపత్రికను నడుపుతున్నాము.మీకు వీలైతె ఈ మాసపత్రికకు వ్యాసాలు రాయండి వాటిని తప్పకుండ ప్రచురిస్తాము. మీరు రాస్తున్న విషయాలు చాలమందికి ఉపయోగపడతాయి..

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..