20, ఆగస్టు 2010, శుక్రవారం

రాజీవ్ గాంధీ - శ్రీలంక తమిళులు



రాజీవ్ గాంధీ ప్రథాన మంత్రిగా తీసుకున్న నిర్ణయాలలో ఆత్మహత్యాసదృశ్యమైనది Indian Peace Keeping Force to Sri Lanka. ఎందుచేతనంటే అక్కడి తమిళుల పట్ల లంకేయ పాలక వర్గం దాష్ఠీకానికి వ్యతిరేకంగా కొన్ని దశాబ్ధాలుగా జరుగుతున్న రాజకీయ, సైనిక పోరాటాలపై భారత దేశం మద్ధతుగా నిలబడాల్సింది పోయి వారిపైకి సైన్యాన్ని పంపడం చరిత్రలో క్షమించరానిదిగా మిగిలిపోయింది. దీని ద్వారా అక్కడి తమిళ ప్రజలలొ భారత్ పై నెలకొన్న నిరసన ఆ తరువాత రాజీవ్ హత్య వరకు దారితీసింది. IPKF ను పంపించడం ద్వారా ఉపఖండంలో పెద్దన్న పాత్ర పోషించడానికి, తద్వారా తమ చుట్టూ వున్న చిన్న దేశాలలో తామంటే ఒక రకమైన భయాన్ని నెలకొల్పడానికి వాడుకోజూడడం రాజకీయంగా తీవ్రమైన నిర్ణయం. మన ప్రజాస్వామ్య ముసుగులోని చినుగును బయటపెట్టింది. వెళ్ళిన సైన్యం అక్కడ ఒడిగట్టిన దారుణాలు ఎంత తీవ్ర పరిణామాలకు దారితీసాయోనన్నది ఓ గుణపాఠం. తమిళుల ఇళ్ళను తగలబెట్టడం, స్త్రీలను అత్యాచారానికి గురిచేయడం, వారి ఆస్తులను ధ్వంసం చేయడం, యువకులను హత్యగావించడం ద్వారా స్వజాతి జనులపైనే ఇలాంటి Genocide కు పాల్పడ్డ దేశంగా మిగిలాం. ఈ దారుణ సైనిక అకృత్యాల తరువాత LTTE మరింత సైనికంగా బలపడింది. ఆ తరువాత అమెరికా, ఇజ్రాయెల్, భారత్ ల సైనిక సహకారంతో ఏడాది క్రితం వాళ్ళు సైనికంగా ఓడిపోయుండొచ్చు. కానీ వారి మనసులపై ఏర్పడ్డ గాయం మాననిది.

1 కామెంట్‌:

  1. mana jhatula bhandikhanalo paalakulanunchi prajaswamyapurithamaina nirnayaalanu ashinchadam verritanamavutundi,srilanka tamilula ashalaku malli chigurinchekaalam raavaalani ,adi vasanthameghagarjana kaavalani korukuntu-gajula

    రిప్లయితొలగించండి

ఆలోచనాత్మకంగా..